ఈ భూ ప్రపంచంలో తల్లిని మించిన యోధురాలు ఎవ్వరూ లేరు. అలానే ఆమె చూపించినంతగా మనపై ఎవరు చూపించరు. నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిస్తుంది. కుటుంబం కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తుంది. అలా సాగించే జీవనంలో తనకు ఉన్న కోరికలు కలగానే మిగిలిపోతాయి. అయితే ఓ కొడుకు మాత్రం తన తల్లి కోరికను నిరవేర్చాడు.
ఈ భూ ప్రపంచంలో తల్లిని మించిన యోధురాలు ఎవ్వరూ లేరు. అలానే ఆమె చూపించినంతగా మనపై ఎవరు చూపించరు. నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిస్తుంది. అలానే ఏ కష్టం రాకుండా బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుతుంది. ఇక తన కోరికలను , సంతోషాలను వదులుకుని బిడ్డల భవిష్యత్తు కోసం మాత్రమే ఆలోచిస్తుంటారు. అలా కుటుంబం కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తుంది. చివరకు వారికి ఉన్న కోరికలు అలానే మిగిలిపోతాయి. అలా వృద్ధాప్యంలో ఉన్న ఓ తల్లి కోరికను.. తనయుడు తీర్చాడు. మరి.. ఆ తల్లి కోరిక ఏమిటో.. ఆ కుమారుడు ఏం చేశాడు? ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
గుజరాత్ రాష్ట్రం కచ్ జిల్లా ముంద్రా ప్రాంతానికి చెందిన మహమ్మద్ ఇబ్రహీం.. తన కుటుంబతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆయన తల్లి రజియా(85) 32 ఏళ్లుగా మంచానికే పరితమైంది. మంచానికే పరిమితమైన తన తల్లికి మహమ్మద్ ఇబ్రహీం సేవలు చేస్తుంటాడు. అయితే రజియాకు ఎప్పటి నుంచి తాజ్ మహల్ ను చూడాలనే కోరిక ఉండేది. అయితే కుటుంబ బాధ్యతలతో ఆమె జీవితం గడిచిపోయింది. చివరకు ఆమె అనారోగ్యం కారణంగా మంచానికే పరిమితమైంది. తనకు తాజ్ మహల్ చూడాలని ఉందని తన మనస్సులోని కోరికను కొడుకుతో చెప్పుకుంది. ఇంతకాలం తమ ఉన్నతకి పాటుపడిన తల్లి కోరిక తీర్చాలని ఆ తనయుడు నిర్ణయించుకున్నాడు.
నడవలేని స్థితిలో ఉన్న ఆమెను ఇబ్రహీం దంపతులు సోమవారం ఆగ్రాకు తీసుకొచ్చారు. ఇందుకోసం దాదాపు 1200 కిలోమీటర్లు రోజంతా ప్రయాణం చేశారు. సోమవారం ఆగ్రాకు వచ్చి.. తన తల్లిని స్ట్రైచర్ పైనే తిప్పుతూ తాజ్ మహల్ మొత్తం చూపించారు. అచేతనలో ఉన్న రజియా ఆ పాలరాతి నిర్మాణాన్ని చూసి ఓ సంతోషం వ్యక్తం చేసింది. అలానే ఆనందంతో ఓ చిరునవ్వును చిందించారు. తన తల్లి కోరిక తీర్చినందుకు చాలా సంతోషంగా ఉందని ఇబ్రహీం తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాక తల్లి కోరిక తీర్చిన ఇబ్రహీం దంపతులను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మరి.. తల్లి కోసం తనయుడు చేసిన ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.