రాఖీ పండుగ ప్రతి ఒక్కరికి ఎంతో స్పెషల్.. ఈ తమ్ముడికి మాత్రం ఈ ఏడాది ఇంకా ప్రత్యేకం. ఆస్తి కోసం కొట్టుకునే అన్నాచెల్లెళ్లు, పగలు ప్రతీకారాలతో ఊగిపోతున్న అక్కాతమ్ముళ్లు ఉన్న ఈ రోజుల్లో వీళ్లు మాత్రం ఎంతోమందికి ఆదర్శం అనే చెప్పాలి. రెండు కిడ్నీలు కోల్పోయిన తమ్ముడికి ఆ అక్క కిడ్నీ ఇచ్చి మళ్లీ కొత్త జీవితాన్ని ప్రసాదించింది.
ఈ రాఖీ సందర్భంగా కచ్చితంగా ఈ అక్కాతమ్ముళ్ల గురించి తెలుసుకోవాల్సిందే. అతని పేరు అమన్ బాత్రా.. 29 ఏళ్ల ఈ కిర్రాడు సినిమాలకు కథలు రాస్తూ ఉంటాడు. అయితే 2013లో అతని రెండు కిడ్నీలు చెడిపోవడంతో అప్పటి నుంచి డయాలసిస్ మీదే కాలం వెళ్లదీస్తున్నాడు. అతనికి చందా గ్రోవర్ అనే 38 ఏళ్ల అక్క ఉంది. ఆమె భర్తతో కలిసి న్యూజిలాండ్లో జీవిస్తోంది.
న్యూజిలాండ్లోని ఆక్లాండ్లో చందా గ్రోవర్కు ఒక సెలూన్, ఇంపోర్ట్ వ్యాపారం కూడా ఉంది. చిన్నప్పటి నుంచి అమన్- చందాలకు ఒకరంటే ఒకరికి ప్రాణం. ఎప్పుడూ ఒకరి గురించి ఆలోచిస్తూ ఉంటారు. 2013లో తమ్ముడికి కిడ్నీలు ఫెయిల్ అయనప్పటి నుంచి చందా తన కిడ్నీ ఇస్తానంటూ అమన్ అడుగుతూనే ఉంది. కానీ అమన్ మాత్రం ఆమెకు నో చెబుతూనే ఉన్నాడు. ఎందుకంటే ఆమెకు చిన్న సూది మందు అన్నా కూడా చచ్చేంత భయం.
అలాంటిది తనకోసం అక్కకు సర్జరీ చేస్తారంటే అమన్ తట్టుకోలేకపోయాడు. ఆమె కిడ్నీ ఇస్తానన్నా కూడా మొదటి నుంచి అమన్ వద్దని చెబుతూనే ఉన్నాడు. అయితే చందా ఒత్తిడి చేస్తుండటంతో చివరికి అమన్ ఓకే చెప్పాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇండియా వచ్చిన చందా గ్రోవర్ వచ్చారు. ఈ జూన్ 11న కిడ్నీ మార్పిడి సర్జరీ విజయవంతం అయ్యింది. జూన్ 22న అమన్ ఆస్పత్రి నుంచి డిశార్జ్ కూడా అయ్యాడు.
జూన్లోనే చందా గ్రోవర్ న్యూజిలాండ్ తిరిగి వెళ్లిపోయారు. ఈసారి ఈ రాఖీని వీళ్లిద్దరూ వర్చువల్గానే జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఇక్కడ ఇంకో ఆసక్తికర విషయం కూడా ఉంది. అదేంటంటే అమన్ అక్క నంబర్ను ప్రిన్సిపల్ మేడమ్ అని సేవ్ చేసుకున్నాడు. ఎందుకంటే తన ఆరోగ్యం గురించి ఆవిడే ఎక్కువ స్ట్రిక్ట్ గా ఉంటారని అలా సేవ్ చేసుకున్నాడంట. మరి.. ఈ అక్కాతమ్ముళ్లకు కామెంట్స్ రూపంలో రాఖీ శుభాకాంక్షలను తెలియజేయండి.