చాలా కాలంగా దర్శకుడు శంకర్ కమెడియన్ వడివేలు మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అప్పట్లో డైరెక్టర్ శంకర్ నిర్మించిన పులికేశి అనే రాజు కథను అప్పట్లో కమెడియన్ వడివేలుతో కలిసి నిర్మించాడు. ఇది మంచి హిట్ కొట్టింది. అప్పట్లో ఇది పెద్ద సంచలనమే అని చెప్పాలి. అయితే దీనికి సీక్వెల్గా హింసై అరసన్ 24 ఆమ్ పులికేసి పేరుతో సినిమాను తీయాలని, అది కూడా వడివేలుతో చేయాలని డైరెక్టర్ శంకర్ నిర్ణయించాడు. కానీ షూటింగ్ మధ్యలో తనకు తెలియకుండా కథలో మార్పులు చేశారని కమెడియన్ వడివేలు షూటింగ్ కి రాకుండా ఉండటంతో డైరెక్టర్ శంకర్ కు వడివేలుకు అప్పట్లో పెద్ద ఎత్తున మనస్పర్థలు వచ్చాయి.
దీంతో శంకర్ నిర్మాతల మండలిలో అప్పట్లోనే కంప్లయింట్ కూడా చేశారు. వడివేలు వల్ల తనకు రూ.2కోట్ల వరకు నష్టం వచ్చిందని శంకర్చెప్పాడు. దాంతో మిగతా నిర్మాతలు వీరిద్దరి మధ్య సయోధ్య కుదుర్చడానికి ప్రయత్నించినా ఫలించలేదు. తాజాగా వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ అధినేత ఐసరి గణేష్ జరిపిన చర్చల వల్ల వీరి మధ్య సయోధ్య కుదిరి… అయితే ఇప్పుడు వడివేలు రూ.2కోట్లు చెల్లించడానికి ఒప్పుకున్నాడు. దీంతో ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.