ఈ మధ్య కాలంలో పలు సినీ పరిశ్రమల్లో తీవ్ర విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. సినీ నటులు, దర్శక, నిర్మాతలు ఇతర సాంకేతిక రంగానికి చెందినవారు వరుసగా కన్నుమూయడంతో వారి కుటుంబ సభ్యులు, అభిమానులు కన్నీటి సంద్రంలో మునిగిపోతున్నారు.
ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఎంతోమంది నటీనటులు, దర్శక, నిర్మాతలతో ఇతర రంగాలకు చెందినవారు కన్నుమూస్తున్న విషయం తెలిసిందే. కొంతమంది వృద్యాప్యం, అనారోగ్యం, రోడ్డు ప్రమాదాల్లో చనిపోతుంటే.. మరికొంతమంది జీవితంపై విరక్తితో బలవన్మరణానికి పాల్పపడుతున్నారు. ఇండస్ట్రీలో చోటు చేసుకుంటున్న వరుస మరణాలు అభిమానులను కలవరపెడుతున్నాయి. తమ అభిమాన నటీనటులు, దర్శకులు కన్నుమూయడంతో వారి కుటుంబ సభ్యులే కాదు.. అభిమానులు సైతం విషాదంలో మునిగిపోతున్నారు. తాజాగా టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
తెలుగు ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు ఎన్ఎస్సార్ ప్రసాద్(49) హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. గతీ కొంతకాలంగా ఆయన క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ‘సీతారామ్’ గా ఇండస్ట్రీ వర్గాలకు సుపరిచితుడైన ప్రసాద్.. ఆర్యన్ రాజేష్ హీరోగా నటించిన ‘నిరీక్షణ’ తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత శ్రీకాంత్ హీరోగా ‘శత్రువు’, నవదీప్ తో ‘నటుడు’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘రెక్కి’ విడుదలకు సన్నాహాల్లో ఉంది.
ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత పలువరు దర్శకుల వద్ద రైటర్, ఘోస్ట్ రైటర్ గా పనిచేశారు. సీతారామ్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్.. పశ్చిమగోదావరి జిల్లాలోని జంగారెడ్డి గూడెం. చదువుకునే రోజుల్లోనే ఆయన సినీ ఇండస్ట్రీపై మక్కువ పెంచుకున్నారు. రచయితగా కెరీర్ ఆరంభించి దర్శకుడిగా మారారు. ఇండస్ట్రీలో ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లేవారని ఆయన సన్నిహితులు అంటున్నారు. ఆయన మరణంపై సినీ ఇండస్ట్రీ ప్రముఖులు సోషల్ మాద్యమాల ద్వారా నివాళులర్పిస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.