నేటి సమాజంలో ఊరేగింపు అనేది చాల రకాలుగా ఉంటుంది. పెళ్ళి కూతురుని, పెళ్లి కుమారుడిని గుర్రాలపై ఉరేగించం అనేది మనం పెళ్లిల్లో చూస్తాము. ఇక ఇది కాకుండా రాజకీయ నాయకుల విజయోత్సవాల్లో వారిని వాహనాలపై లేక గుర్రాలపై ఉరేగించటం అనేది సర్వ సాధారణమైన అంశంగా చెప్పవచ్చు. కానీ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఆ గ్రామ ప్రజలు విచిత్రంగా అలోచించి అందరి పెదవులపై నవ్వులు పుయిస్తున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే..మధ్యప్రదేశ్ రాష్ట్రం విదిష జిల్లా రంగై గ్రామంలో సర్పంచ్ ని ఏకంగా గాడిదపై ఊరేగించి సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. సర్పంచ్ ని గాడిదపై ఉరేగిస్తున్నారంటే తమరు ఆ గ్రామానికి ఏదో అన్యాయం చేశారేమో అందుకే ఆలా చేశారు అని అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. అవును మీరు విన్నది నిజమే. ఇక విషయానికొస్తే..ఆ గ్రామంలో వర్షాలు కురవటం లేదని గ్రామ సర్పంచ్ ని గాడిదపై ఊరేగిస్తూ గ్రామస్తులు ఊరంతా తిరిగారు. బ్యాండ్ మేళాలతో, డాన్స్ లతో ఊరంతా పండగ వాతావరణం నెలకొంది. ఇక గాడిద పై ఉన్న సర్పంచ్ కి గ్రామంలోని మహిళలు స్వాగతం పలుకుతూ బొట్లు పెడుతూ పూల దండలేస్తూ మొక్కుకుంటున్నారు.
ఊరేగింపు పూర్తైన తర్వాత వర్షం కోసం ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామంలోని పెద్దలు, అధికారులంతా హాజరయ్యారు. మా గ్రామంలో ఈ ఆచారం ఎప్పడి నుంచో ఉందని స్థానికులు చెబుతున్నారు. ఇక అన్ని రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తూ వాగులు, వంకలు పొంగి పొర్లుతుంటే ..మద్యప్రదేశ్లో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా దర్శనమిస్తుండటం విశేషం. ఇక ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. మీరు కూడా ఓ సారి లుక్కేయండి. ఇక దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.