భర్త చాన్నాళ్ల క్రితం చనిపోయాడు. పిల్లల భారం కష్టమనుకోలేదు తల్లి. ఆరుగురు పిల్లలను ఒంటరిగానే సాగింది. వారిని ప్రయోజకుల్ని చేసింది. అంతా బాగుంది అనుకునే సమయంలో విధికి కన్నుకొట్టిందో ఏమో ఊహించని విపత్తును తీసుకువచ్చింది.
భర్త చాన్నాళ్ల క్రితం చనిపోయాడు. పిల్లల భారం కష్టమనుకోలేదు తల్లి. ఆరుగురు పిల్లలను ఒంటరిగానే సాకింది. వారిని ప్రయోజకుల్ని చేసింది. అంతా బాగుంది అనుకునే సమయంలో విధికి కన్నుకొట్టిందో ఏమో ఊహించని విపత్తును తీసుకువచ్చింది. ఆ ఇంట్లో ఒక రోజులోనే రెండు విషాదాలు నెలకొన్నాయి. ఒకరు దూరమయ్యారంటే.. మరొకరు కూడా కానరాని లోకాలకు వెళ్లిపోయారు. ఇద్దరిని బలితీసుకున్నాయి రోడ్డు ప్రమాదాలు. రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో తల్లి కుమారుడు చనిపోయారు. ఇద్దరి చితికి ఒకేసారి మంట పెట్టాల్సిన దారుణమైన పరిస్థితి ఆ కుటుంబానికి ఎదురైంది. ఈ హృదయ విదారకర ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది.
రేవా జిల్లా జాత్రి గ్రామానికి చెందిన మహిళ రాణీదేవికి కొన్నాళ్ల క్రితం భర్త చనిపోవడంతో.. ముగ్గురు కొడుకులు, ముగ్గురు కుమార్తెల భారం ఆమెపై పడింది. ఆమె రెక్కల కష్టంతోనే వారిని ప్రయోజకులను చేసింది. పెద్ద కొడుకు ప్రకాశ్, చిన్నకొడుకు సన్నీతో ఆమె కలిసి ఉంటోంది. మరో కుమారుడు సూరజ్ ఇండోర్లో తన స్నేహితులతో ఉంటున్నాడు. బుధవారం తన చిన్న కుమారుడు సన్నీతో కలిసి తల్లి బైక్ పై తన పుట్టింటికి వెళుతుండగా వీరి వాహనాన్ని మరో బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో తల్లి కుమారుడు ఇద్దరు గాయపడ్డారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. ఆమె పరిస్థితి విషమంగా మారడంతో రేవా జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా ఆమె కన్నుమూసింది. ఈ విషయం తెలిసిన రెండో కుమారుడు సూరజ్ హుటా హుటిన ఇండోర్ నుండి బయలు దేరాడు.
ఇండోర్ నుంచి తన స్నేహితుడి అభిషేక్ సింగ్ కారు తీసుకుని, డ్రైవర్ మాట్టాడుకుని బుధవారం రాత్రి బయలుదేరాడు. ఇక గ్రామానికి రెండు గంటల్లో చేరుకుంటాననుకోగా.. సత్నా జిల్లా రామ్పూర్ బాఘేలన్ వద్ద కారు ప్రమాదానికి గురయ్యింది. కారు టైరు పేలి.. నిలిపి ఉన్న ట్రక్కును ఢీ కొట్టడంతో కారు నుజ్జునుజ్జు అయ్యింది. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు గురువారం ఘటనాస్థలానికి చేరుకుని కారులో ఉన్న ముగ్గుర్ని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు.. తీవ్ర గాయాలతో రేవా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సూరజ్ చనిపోయాడు. కేవలం 12 గంటల వ్యవధిలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో తల్లీ కొడుకులు ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబంలోనే కాదూ గ్రామంలో కూడా విషాద ఛాయలు నెలకొన్నాయి. ఇద్దరికీ ఒకేసారి చితికి నిప్పంటించారు కుటుంబ సభ్యులు.