గత కొన్ని రోజులుగా తెలంగాణ ముఖ్య నేతలు ఢిల్లీ లో సందడి చేస్తున్నారు. ఇటీవల కాలంలో తెలంగాణ నుంచి తెలంగాణ సీఎం, గవర్నర్ తమిళసై, కాంగ్రెస్ ముఖ్య నేతలు వరుసగా ఢిల్లీలో అగ్రనేతలతో భేటీ అవుతున్నారు. ఈ నెల 4వ తేదీన తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఢిల్లీలో రాహూల్ గాంధీతో ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రజా సమస్యల పరిష్కారానికి తెరాస ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు. రాహుల్తో మాట్లాడిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్లో ఉన్న విభేదాలన్నీ మర్చిపోయా. అప్పుడు చెప్పిన విషయాలేవీ గుర్తులేవు. తెలంగాణలో అధికార పార్టీ తెరాస, భాజపా, ఎంఐఎంలను మూడు పార్టీలో ఒక విధానంలో ఉన్నాయని వారంతా ఒక్కటే అని.. ప్రజలకు ఈ విషయం అర్ధమయ్యేలా తెలియజేయాలని ప్రజా సమస్యల పరిష్కారానికి ఎలా పోరాడాలనే దానిపై రాహుల్ చర్చించారు. కాంగ్రెస్ను గెలిపించేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేస్తాం.
రాష్ట్రంలో మా మధ్య ఎలాంటి విభేదాలు ఉండవని.. కొన్ని సందర్భాల్లో ఎమోషనల్ గా మాట్లాడి ఉండొచ్చు కానీ చివరికి అందరం కలిసికట్టుగా ఎలా పనిచేస్తామో మీరే చూస్తారు అని జగ్గారెడ్డి అన్నారు. బుధవారం తనను కలిసేందుకు జగ్గారెడ్డికి అపాయింట్మెంట్ ఇచ్చారు రాహూల్ గాంధీ. కాగా, కుటుంబ సభ్యులతో కలిసి రాహుల్గాంధీతో ఫొటో దిగడం ఆనందంగా ఉందని, అందుకే దిల్లీ వచ్చామని వివరించారు.