ఇటీవల రాజకీయ నేతల కుటుంబాల్లో వరుసగా విషాదాలు నెలకొంటున్నాయి. కుటుంబ సభ్యులను కోల్పోయి పుట్టెడు దు:ఖంలో మునిగిపోతున్నారు. అందులోనూ యుక్త వయస్సులో ఉన్న పిల్లల్ని పోగొట్టుకోవడం.. వారిని కన్నీటి సంద్రంలో ముంచేస్తుంది.
ఇటీవల రాజకీయ నేతల కుటుంబాల్లో వరుసగా విషాదాలు నెలకొంటున్నాయి. కుటుంబ సభ్యులను కోల్పోయి పుట్టెడు దు:ఖంలో మునిగిపోతున్నారు. అందులోనూ యుక్త వయస్సులో ఉన్న పిల్లల్ని పోగొట్టుకోవడం.. వారిని కన్నీటి సంద్రంలో ముంచేస్తుంది. మొన్నటికి మొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకుడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మానుకొండ రాధా కిషోర్ కుమారుడు శ్రీధర్ గుండెపోటుతో మరణించారు. ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు.. కానీ జిమ్ కు వెళ్లి ఇంటికి వచ్చిన కొద్ది సేపటికే కుప్పకూలిపోయాడు. నల్గొండ జిల్లా నిడమానూను మండలం తుమ్మడము గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత, మాజీ మండల ప్రజాపరిషత్ సభ్యుడు యడవెల్లి రంగశాయి రెడ్డి తనయుడు వల్లభ్ రెడ్డి భార్య లహరి కూడా హార్ట్ స్ట్రోక్ కారణంగా మరణించింది.
ఇప్పుడు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన పెద్ద కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి తుది శ్వాస విడిచారు. మూడు రోజుల క్రితం అనారోగ్యానికి గురైన విష్ణును కుటుంబ సభ్యులు కాంటినెంటల్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స అందిస్తుండగా.. ఆరోగ్యం విషమించి గురువారం ఉదయం 2.30 గంటలకు కన్నుమూశారు. రెండు కిడ్నీలు ఫెయిల్ అవ్వడంతో చికిత్స అందిస్తుండగా.. గుండె పోటుతో మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ వార్త తెలియగానే బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యేను పరామర్శించి, సానుభూతి వ్యక్త పరిచారు. గత ఎన్నికల్లో నియోజకవర్గంలో తండ్రి తరుఫున ప్రచారం చేశాడు విష్ణు. తండ్రితో కలిసి రాజకీయ కార్యక్రమాల్లో అతడు చురుగ్గా పాల్గొనేవాడు. దీంతో నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో అతడికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.