ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన రైళ్ల ప్రమాదం యావద్ భారత ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. ఒకేసారి మూడు రైళ్ల ప్రమాదం జరగడంతో 288 మంది చనిపోగా వందల మంది గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికీ ఈ ఘటన బాధిత కుటుంబాలు మర్చిపోలేకపోతున్నారు.
ఇటీవల కాలంలో దేశంలో పలు చోట్ల రైలు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ మద్య ఒడిశాలోని బాలాసోర్ జిల్లా లో జరిగిన రైళ్ల ప్రమాదం యావత్ భారత దేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నామన్న సంతోషంలో ఉన్న ప్రయాణీకులు అంతలోనే కానరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ ప్రమాదంలో 288 మంది చనిపోగా వెయ్యికి మందిపైగా తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒడిశా రైలు ప్రమాదం ఇప్పటికీ మృతుల బంధువులు మర్చిపోలేకపోతున్నారు. ఈ ప్రమాదం జరిగిన బహానగ గ్రామంలో స్థానికులు మృతుల ఆత్మకు శాంతి చేకూరాలనే ఉద్దేశంతో సామూహిక కర్మకాండలు నిర్వహించారు. వివరాల్లోకి వెళితే..
ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద ఘటన ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. క్షణాల వ్యవధిలో మూడు రైళ్లు ప్రమాదానికి గురికావడంతో యావత్ భారత దేశం ఒక్కసారే ఉలిక్కి పడింది. ఈ విషాద సంఘటన నుంచి ఎన్నో కుటుంబాలు ఇంకా కోలుకోలేకపోతున్నాయి. రైలు ప్రమాదం సరిగ్గా బహానగ గ్రామంలో సమీపంలో జరిగింది. ఆదివారం నాటికి పదిరోజులు కావడంతో ఆ గ్రామ ప్రజలు దాదాపు 116 మంది మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని సామూహికంగా గుండ్లు గీయించుకున్నారు. తర్వాత సమీపంలో ఉన్న చెరువులో స్నానం చేసి కొత్త దుస్తులు ధరించి సాయంత్రం వేల మృతుల కోసం ఆహారాన్ని సమర్పించారు.
ఇంతటి విషాద ఘటన తమ ఊరిలో జరగడాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నామని గ్రామస్తులు అంటున్నారు. సోమవారం 11 వ రోజు కావడంతో బహానగ పాఠశాల పక్కన ఓ మైదానంలో విశ్వశాంతి యజ్ఞంతో పాటు, సర్వమత ప్రార్థనలు జరిపిస్తామని అన్నారు. అనంతరం గ్రామస్థులకు భోజనాల ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇలాంటి ప్రమాదాలు ఎప్పటికీ జరగకూడదని.. చనిపోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించి ఈ కార్యక్రమం తలపెట్టామని స్థానిక పెద్దలు తెలిపారు. కాగా, ఈ ఘటన కుట్రకోణం దాగి ఉందని ఆరోపణలు రావడంతో సీబీఐ విచారణకు కేంద్రం ఆదేశించిన విషయం తెలిసిందే.