యాసంగిలో పండించిన చివరి ధాన్యం గింజ వరకు కేంద్రం మద్దతు ధరకు కొనాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వం పెద్దఎత్తున నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. ధాన్యం కొనుగోలు అంశంపై అటు తెలంగాణ, ఇటు కేంద్ర ప్రభుత్వాలపై రాహుల్ గాంధీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతలు విస్మరిస్తున్నాయంటూ విమర్శించారు.
ఇదీ చదవండి: తీవ్ర విషాదం.. మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తూ, రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటు.
రైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టే రైతులని క్షోభ పెట్టే పనులు మాని, పండించిన ప్రతి గింజా కొనాలి.
— Rahul Gandhi (@RahulGandhi) March 29, 2022
‘తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తూ, రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటు. రైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టే రైతులని క్షోభ పెట్టే పనులు మాని, పండించిన ప్రతి గింజా కొనాలి.’ అంటూ రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. అయితే రాహుల్ గాంధీ ట్వీట్ కు కల్వకుంట్ల కవిత కౌంటర్ ఇచ్చారు. నామమాత్రంగా ట్విట్టర్ సంఘీభావం తెలపడం కాదంటూ ఎద్దేవా చేశారు.
‘రాహుల్ గాంధీ గారు మీరు ఎంపీగా ఉన్నారు, రాజకీయ లబ్ధి కోసం నామమాత్రంగా ట్విట్టర్లో సంఘీభావం తెలుపడం కాదు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు ఒక నీతి, ఇతర రాష్ట్రాలకు మరో నీతి ఉండకూడదని టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ప్రతిరోజు పార్లమెంట్ వెల్ లోకి వెళ్లి తమ నిరసన తెలియజేస్తున్నారు.. మీకు నిజాయితీ ఉంటే తెలంగాణ ఎంపీలకు మద్దతుగా వెల్ లోకి వచ్చి నిరసన తెలియజేయండి.. ఒక దేశం ఒకే సేకరణ విధానం కోసం డిమాండ్ చేయండి’ అంటూ కల్వకుంట్ల కవిత రాహుల్ గాంధీకి ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ- కవిత ట్వీట్ వార్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
.@RahulGandhi గారు మీరు ఎంపీగా ఉన్నారు, రాజకీయ లబ్ది కోసం నామమాత్రంగా ట్విట్టర్లో సంఘీభావం తెలుపడం కాదు.
ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు ఒక నీతి, ఇతర రాష్ట్రాలకు మరో నీతి ఉండకూడదని @trspartyonline ఎంపీలు ప్రతిరోజు పార్లమెంట్ వెల్ లోకి వెళ్లి 1/2 https://t.co/BTMd0GwKPe— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 29, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.