మనిషి సమాజంలో గౌరవంగా బతకాలీ అంటే చదువు ఎంతో ముఖ్యం. చదువు సంస్కారం, జ్ఞానాన్ని ఇస్తుంది. చదువుకు వయసుకు సంబంధం ఉండదు అన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని నిరూపించాడు ఒక ఎమ్మెల్యే. 70 ఏళ్ల వయసులో ఆయన పిల్లల మద్య కూర్చొని పదవ తరగతి ఎగ్జామ్స్ రాశారు. ఆ ఎమ్మెల్యే పేరు అంగాడ కన్హార్. ఆయన జనతాద పార్టీకి చెందిన శాసనసభ్యుడు.. చిన్నప్పటి నుంచి చదువుపై మక్కువ ఉన్నా కొన్ని కారణాల వల్ల కొనసాగించలేకపోయాడు. ప్రస్తుతం ఆయన ఫూల్ బనీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఈ సందర్భంగా అంగాడ కన్హార్ మీడియాతో మాట్లాడుతూ.. తాను నాలుగు దశాబ్ధాల క్రితం చదువు మానివేసినట్లు తెలిపారు. యుక్త వయసు నుంచి రాజకీయాల్లోకి వచ్చానని.. తనకు అన్నిచోట్ల మంచి పేరు వచ్చింది.. కానీ 10 వ తరగతి కూడా చదవ లేక పోయానని బాధ నన్ను ఎప్పుడూ వెంటాడుతుండేది. నా కుటుంబ సభ్యులు, సన్నిహితులు పదవ తరగతి పరీక్ష రాయాలని ప్రోత్సహించారు. అప్పటి నుంచి దీక్షగా చదువుతూ పాస్ అవ్వడానికి నా పరీక్షను రాశానని ని కన్హాన్ తెలిపారు.
డిగ్రీ కావాలంటే కనీసం పదవ తరతగి పాస్ కావాలని అందుకే తాను పట్టుదలదో చదవి ఎగ్జామ్ రాసినట్లు తెలిపారు. పాస్ మనిషికి సంకల్పం ఉంటే ఏదైనా సాధించుకోవొచ్చని.. ఈ వయసులో ఎందుకులే అనుకుంటే అక్కడే ఆగిపోతారు. మన లక్ష్యం గొప్పది అయినప్పుడు వీటిని లెక్క చేయనక్కర్లేదని నిరూపించారు ఎమ్మెల్యే. దీనికి సంబంధిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Odisha | Biju Janata Dal (BJD) MLA from Phulbani, Angada Kanhar appeared for his Class 10th examinations. He was among the 5.8 lakh students appearing for the Class 10 state board examination in Odisha that commenced on Friday. pic.twitter.com/hFWNJjXZ5l
— ANI (@ANI) April 29, 2022