పెగాసస్ వ్యవహారం పై కేంద్ర ప్రభుత్వానికి దిమ్మ తిరిగే షాక్ తగిలింది. ఈ వ్యవహారం పై మోడీ సర్కార్ కు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల పై ఇవాళ విచారించిన సుప్రీం కోర్టు ఈ మేరకు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. అయితే ఈ నోటీసులపై పదిరోజుల్లోనే వివరణ ఇవ్వాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. పెగాసస్ స్పైవేర్ వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా దాచేయడానికి ఏం లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది.
దీనిపై అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించడానికి, అనుమానాలను నివృత్తి చేయడానికి నిపుణుల కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రాజకీయ ప్రత్యర్థులు, సామాజిక ఉద్యమకారులు, జర్నలిస్టుల ఫోన్లపై కేంద్ర ప్రభుత్వం ఇజ్రాయెల్కు చెందిన పెగసస్ స్పైవేర్తో నిఘా పెట్టిందని, ఈ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది.
దేశవ్యాప్తంగా దుమారం లేపిన పెగాసస్పై కేంద్రం సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేసింది. పెగసస్తో ప్రముఖల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారనే ఆరోపణలన్నీ తప్పని సుప్రీంకోర్టుకు తెలిపింది.ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ నేతృత్వంలోని ధర్మాసనం ముందు కేంద్రం రెండు పేజీల అఫిడవిట్ దాఖలు చేసింది. దీనిపై నిపుణుల కమిటీ వేస్తామని ఈ అంశాన్ని ఆ ప్యానెల్ పరిశీలిస్తుందని కోర్టుకు తెలిపింది.
పెగాసస్ పై దాఖలు చేసిన పిటిషన్ల ను రెండో రోజు సుప్రీం కోర్టు విచారణ చేసింది. అన్ని దేశాల ప్రకారమే తాము కూడా పెగాసస్ నుంచి సాఫ్ఠ్ వేర్ ను కొనుగోలు చేశామని తెలిపింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం పై సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.