భారత దేశంలో కొంతకాలంగా క్రిమినల్ యాక్టివిటీస్ బాగా పెరిగిపోతున్నాయి. మహిళలపై లైంగి వేధింపులు, అత్యాచారాలు, హత్యలు కొనసాగుతున్నాయి. దోపిడీలు, దొమ్మీల గురించి చెప్పనక్కరలేదు. ఎన్ని కఠిన చట్టాలు తీసుకువస్తున్నా క్రిమినల్స్ లో మార్పు రావడం లేదు.
నేటి సమాజంలో నేరగాళ్లు పలు రకాల నేరాలు చేస్తూ రెచ్చిపోతున్నారు. ఇక మహిళలకు ఎక్కడా రక్షణ లేకుండా పోతుంది. చిన్న పిల్లల దగ్గరు నుంచి వృద్ద మహిళల వరకు కామాంధులు ఎవ్వరినీ వదలడం లేదు. ఎన్ని కఠిన చట్టాలు తీసుకువస్తున్నా కామాంధుల్లో ఏమాత్రం భయం లేకుండా పోతుంది. ఆడది కనిపిస్తే చాలు మృగాల మాదిరిగా పేట్రేగిపోతున్నారు. ఇలాంటి వారికి బుద్ది చెప్పేందుకు ఈ రోజు పార్లమెంట్ సాక్షిగా క్రిమినల్ కేసుల్లో భారీ మార్పులు చేసింది. ఇక నుంచి ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్లకు పునరుద్ధరిస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం లోక్సభలో మూడు బిల్లులను ప్రవేశపెట్టింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
దేశంలో కొంతకాలంగా నేరాల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి. దొంగతనాలు, హత్యలు, దోపిడీలు, అత్యాచారాల, బ్లాక్ మెయిలింగ్ ఎన్నో రకాల క్రిమినల్ యాక్టివిటీస్ పెరిగిపోయాయి. వీటిని అరికట్టే క్రమంలో న్యాయ వ్యవస్థలో కీలక మార్పులకు సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. క్రిమినల్ జస్టిస్ వ్యవస్థలో పెద్ద ఎత్తున మార్పులకు శ్రీకారం చుట్టింది. నేడు దీనికి సంబంధించిన మూడు బిల్లులను కేంద్ర హూంశాఖా మంత్రి అమిత్ షా శుక్రవారం లోక్ సభలో ప్రవేశపెట్టారు. 1.భారతీయ న్యాయ సంహిత- 2023, 2.భారతీయ నాగరిక్ సురక్ష సంహిత- 2023,3. భారతీయ సాక్ష్య బిల్లు- 2023లను తదుపరి పరిశీలన కోసం పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపిస్తామని అమిత్ షా తెలిపారు. ఇవి శిక్షించడానికి కాదని, బాధితులకు న్యాయం చేయడమే వాటి ఉద్దేశమని లోక్ సభలో ఈ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా అమిత్ షా అన్నారు.
ఈ సందర్బంగా అమిత్ షా మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 1860 నుంచి 2023 వరకు దేశంలో ఉన్న న్యాయ వ్యవస్థలు అన్నీ బ్రిటీష్ హయాంలో రూపొందించిన విధంగానే అమలు అవుతూ వస్తున్నాయి. ప్రస్తుతం తీసుకువస్తున్న మూడు కొత్త చట్టాలు ప్రతి భారతీయ పౌరుడు హక్కులను పరిరక్షించే స్ఫూర్తిని తీసుకువస్తాయని అన్నారు. దేశ ద్రోహ చట్టం రద్దు చేయబడిందని.. ప్రతిపాదిత చట్టంలోని దేశద్రోహం అనే పదం లేదు. భారత సార్వభౌమత్వం, ఐక్యత, సమగ్రతకు విఘాతం కలిగించే చర్యలకు సెక్షన్ 150 ద్వారా దాని స్థానంలో ఉందని అన్నారు. ప్రస్తుత చట్ట ప్రకారం దేశ ద్రోహానికి యావజ్జీవ కారాగార శిక్ష లేదా మూడేళ్ల వరకు పొడిగించే జైలు శిక్ష విధించబడుతుందని అన్నారు. కొత్త బిల్లు ద్వారా 3 లేదా 7 ఏళ్లు జైలు శిక్షగా మార్చాలని ప్రతిపాదించినట్లు తెలిపారు.
ఇదిలా ఉంటే అత్యాచార చట్టంలో కీలక మార్పులు చేసినట్లు అమిత్ షా తెలిపారు. ఇకపై మైనర్ల పై అత్యాచారానికి పాల్పడే వారికి మరణశిక్ష విధించే నిబంధనలు ఉంటాయని ప్రకటించారు. సామూహిక అత్యాచారానికి 20 ఏళ్ల జైలు శిక్ష, సామూహిక దాడులకు పాల్పపడితే ఏడేళ్లు జైలు శిక్ష పడుతుంది. జీవిత ఖైదు అనే పదాన్ని సహజ జీవితానికి జైలు శిక్ష అని నిర్వచించారు. ఏడేళ్ల జైలు శిక్ష విధించే కేసుల్లో ఇక నుంచి ఫోరెన్సిక్ సాక్ష్యాలు ఖచ్చితంగా ఉండాలని పేర్కొన్నారు. వీటితో పాటు ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ నమోదు చేసే విధంగా ఎఫ్ఐఆర్ ప్రవేశపెడుతున్నామన్నారు. అంతేకాదు ఎఫ్ఐఆర్ నుంచి చార్జ్ షీట్ వరకు అన్నీ డిజిటైలేజ్ చేయాలని బిల్లులో ఉంది. అత్యాచారానికి గురైన వారి గుర్తింపును బహిర్గతం చేసినందుకు శిక్ష విధించే నిబంధనలు కూడా ఇందులో ఉన్నాయని అన్నారు. భారతీయ శిక్షాస్మృతిలో తీసుకు వస్తున్న మార్పుల ద్వారా ఇకపై దేశంలో శాంతికి భంగం కలిగించే నేరాలు, సాయుధ తిరుగుబాటులు, విధ్వంసకర చర్యలు ఉండబోవని అన్నారు.
#BREAKING Centre to introduce three bills in the Lok Sabha today to replace Indian Penal Code, CrPC and the Indian Evidence Act.
– The Bharatiya Nyaya Sanhita, 2023
– The Bharatiya Nagarik Suraksha Sanhita, 2023
– The Bharatiya Sakshya Bill, 2023— Live Law (@LiveLawIndia) August 11, 2023