పోటీలో నెగ్గి నగదు బహుమతి పొందాలనుకుంటున్నారా అయితే ఈ అద్భుత అవకాశం మీ కోసమే. ఎందుకంటే ఈ పోటీలో గెలిస్తే.. మీ ఖాతాలోకి రూ. 11 వేలు వచ్చి చేరుతాయి. ఇంతకు ఈ పోటీ ఎవరూ నిర్వహిస్తున్నారూ అంటే స్వయానా కేంద్ర ప్రభుత్వమే.
కాంటెస్టులో పాల్గొనాలంటే ఇష్టమా.. పోటీలో నెగ్గి నగదు బహుమతి పొందాలనుకుంటున్నారా అయితే ఈ అద్భుత అవకాశం మీ కోసమే. ఎందుకంటే ఈ పోటీలో గెలిస్తే.. మీ ఖాతాలోకి రూ. 11 వేలు వచ్చి చేరుతాయి. ఇంతకు ఈ పోటీ ఎవరూ నిర్వహిస్తున్నారూ అంటే స్వయానా కేంద్ర ప్రభుత్వమే. ఈ కాంపిటీషన్లో పాల్గొనాలంటే ఎక్కువ సమయం లేదు. కేవలం రెండు రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఇంతకు ఆ పోటీ ఏంటో, ఎక్కడ జరుగుతుంది, ఏం చేయాలన్నా ఉత్సుకతతో ఉన్నారు కదా. అయితే ఈ పూర్తి వివరాలు మీ కోసమే…దేశానికి వెన్నుముక రైతు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ రైతును ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను తీసుకువచ్చాయి.
ముఖ్యంగా ప్రధాని మోడీ తీసుకువచ్చిన కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఏడాదికి రూ. 6వేలు చొప్పున లేదా మూడు దఫాలుగా రూ. 2 వేల చొప్పున అర్హత కలిగిన రైతులు లబ్ది పొందుతున్నారు. ఇప్పటికే ఈ పథకం ద్వారా లబ్దిదారులైన రైతులకు రూ. 26 వేలు అందాయి. ఇప్పటి వరకు 13 విడతల్లో ఆర్థిక సాయాన్ని అందించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు 14వ విడత నగదు జమ కావాల్సి ఉంది. అయితే రెండు రోజుల్లో ఈ డబ్బులు కూడా వారి బ్యాంకు ఖాతాల్లో పడనున్నాయి. దీంతో ఇప్పటి వరకు రూ. 28 వేలు పొందినట్లు అవుతుంది.ఈ నేపథ్యంలో ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని కేంద్రం సూచిస్తోంది. ఇది పీఎం కిసాన్ వెబ్ సైట్లోకి వెళ్లి చేసుకోవచ్చు. దగ్గరలోని కామన్ సర్వీస్ సెంటర్కు వెళ్లి కేవైసీ పూర్తి చేయోచ్చు.
అయితే మనకు ఖాతాలో రూ. 11 వేలు ఎలా పడతాయి అనుకుంటున్నారా..? అదేంటంటే.. పీఎం కిసాన్ స్కీమ్ కు సంబంధించిన లోగో డిజైన్ కాంటెస్ట్ నిర్వహిస్తోంది కేంద్రం. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మై గౌ వెబ్ సైట్ వెల్లడించింది. ఈ కాంటెస్టులో ఎవ్వరైనా పాల్గొనవచ్చు. మీరేం చేయాలంటే పీఎం కిసాన్ స్కీమ్ లోగోను డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఈ కాంటెస్ట్ జులై 13 వరకు అందుబాటులో ఉంటుంది. అంటే రెండు రోజుల గడువే మిగిలి ఉంది. ఈ కాంటెస్టులో విజేతగా నిలిచిన వారికి రూ. 11 వేలు లభిస్తాయి. అలాగే ఇద్దరికి కన్సోలేషన్ ప్రైజ్ కూడా ఉంది. ఈ ఇద్దరికీ రూ. 5 వేలు చొప్పున అందిస్తారు. మరెందుకు ఆలస్యం.. మై గౌ వెబ్ సైట్ లో వెళ్లి కంటెస్టులో పాల్గొనండి.