ఈమధ్య కాలంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అతివేగం, నిర్లక్ష్యం, మద్యపానం తాగి డ్రైవింగ్ చేయడం లాంటి కారణాల వల్ల యాక్సిడెంట్లు ఎక్కువవుతున్నాయి. వీటిల్లో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఇలాంటి ఓ ఘోర రోడ్డు ప్రమాదం మహారాష్ట్రలో చోటుచేసుకుంది. మహారాష్ట్ర రాయ్గఢ్ జిల్లాలోని రెపోలి ప్రాంతం వద్ద ముంబై-గోవా హైవే మీద వెళ్తున్న కారు ఓ లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒక చిన్నారి సహా 9 మంది మృతి చెందారు. మరో చిన్నారికి తీవ్రంగా గాయాలయ్యాయి. మృతుల్లో 8 మంది పురుషులు, ముగ్గురు స్త్రీలు, ఒక చిన్నారి ఉన్నారు.
రెపోలి ప్రాంతం వద్ద జరిగిన ఈ యాక్సిడెంట్లో కారు నుజ్జునుజ్జు అయ్యింది. ప్రమాదం జరిగిన చోటుకు చేరుకున్న పోలీసులు గాయపడిన చిన్నారిని వెంటనే సమీపంలోని హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం ఆ చిన్నారి చికిత్స పొందుతోంది. ముంబై వైపుగా వెళ్తున్న ట్రక్కును.. రత్నగిరి జిల్లాలోని గుహగర్కు వెళ్తున్న కారు ఢీ కొట్టిందని పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ను క్లియర్ చేశామని అన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. ఈ యాక్సిడెంట్లో కారు నుజ్జనుజ్జవడాన్ని బట్టి ప్రమాద తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.