పంజాబ్ రాజకీయాల్లో కాంగ్రెస్ హై కామాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా పంజాబ్ లో పీసీసీని నియమించింది. ఇక పంజాబ్ పీసీసీగా నవజ్యోత్ సింగ్ సిద్ధ్ ను నియామకం చేస్తూ సోనియా గాంధీ నిర్ణయం తీసుకుంది. పంజాబ్ రాజకీయాల్లో రోజురోజుకి అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. దీన్నీసద్దుమణిగించేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు ఈ దిశగా ప్రయత్నాలు చేశారు. ప్రస్తుతం సునీల్ జఖర్ పంజాబ్ పీసీసీగా కొనసాగుతున్నాడు. దీంతో ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడిని అధ్యక్షుడిని నియామకం చేస్తూ సోనియా గాంధీ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఇక పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు అమరీందర్ సింగ్. గత కొంతకాలంగా పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ మధ్య మాటల తూటాలు కొనసాగుతున్నాయి. ఇరువురి మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమనేలా తయారైంది పరిస్థితి. ఇక ఒకరిపై ఒకరు దూషణలు చేసుకుంటూ సొంత పార్టీలోనే కుంపటిని ఏర్పాటు చేసుకుంటున్నారు నేతలు. దీంతో ఒక రకంగా నవజ్యోత్ సింగ్ ను పీసీసీగా నియమించటం అమరీందర్ కి నచ్చని పరిస్థితి.
ఈ క్రమంలోనే వీరి మధ్య గొడవ తార స్థాయికి చేకూరుకుంటోంది. దీంతో వీరి గొడవని చల్లార్చేందుకు సోనియా రంగంలోకి దిగింది. ఇక ఇరువురి నేతలను సోనియా ఒప్పించే ప్రయత్నం చేసినా..ఫలితం లేకుండా పోయింది. దీంతో ఎట్టకేలకు సోనియా పంజాబ్ పీసీసీగా నవజ్యోత్ సిద్ధ్ ను నియమించింది. ఇక పంజాబ్ లో వచ్చే ఏడాది ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈ దిశగా అడుగులు వేసినట్టు తెలుస్తోంది.