ఏదైనా కలిసి రావాలన్నా అదృష్టం వరించాలని అంటుంటారు పెద్దలు. కష్టానికి ప్రతిఫలానికి తోడు ఆవగింజంత అదృష్టం ఉండాలట. ఓ పని చేసి ఫలితం దక్కనప్పుడల్లా ఈ మాట మెలిపెడుతుంది కూడా.
ఏదైనా కలిసి రావాలన్నా అదృష్టం వరించాలని అంటుంటారు పెద్దలు. కష్టానికి ప్రతిఫలానికి తోడు ఆవగింజంత అదృష్టం ఉండాలట. ఓ పని చేసి ఫలితం దక్కనప్పుడల్లా ఈ మాట మెలిపెడుతుంది కూడా. అదృష్టం ఉంటే చాలు పట్టిందల్లా బంగారం, ముట్టిందల్లా ముత్యాలు అవుతాయట. అయితే అదృష్టం అందరినీ వరించదు. అన్ని సమయాల్లోనూ రాదు. అదృష్టం ఒక్కసారే తలుపు తడితే.. దరిద్రం తలుపు తీసే వరకు కొడుతూనే ఉంటుందట. అయితే అతడికి మాత్రం అదృష్టం కొన్ని గంటల్లోనే వరించడం నిజంగా విడ్డూరం. ఏకంగా అతడిని కోటీశ్వరుడిని చేసింది. ఆ జాక్ పాట్ కొట్టిన అదృష్టవంతుడుది పంజాబ్.
వివరాల్లోకి వెళితే గురుదాస్ పూర్ జిల్లా డేరా నానక్ బాబాకు చెందిన రూపీందర్జిత్ సింగ్ అగ్రికల్చరల్ డెవలప్ మెంట్ బ్యాంకులో క్లర్క్గా పనిచేస్తున్నాడు. అయితే కోటీశ్వరుడు కావాలన్న ఉద్దేశంతో గత ఏడాది నుండి లాటరీలు కొంటూవస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం కూడా నాగాలాండ్ లాటరీ ఏజెంట్ నుండి 25 లాటరీలు కొన్నాడు. ఒక్కోటి రూ. 6 చొప్పున కొనుగోలు చేశారు. ఆ తర్వాత బ్యాంకుకు వెళ్లిపోయాడు. కొన్న గంటలోనే తన లాటరీకి కోటి రూపాయలు తగింలిందంటూ ఏజెంట్ నుండి ఫోన్ వచ్చింది. అంతే ఆనందలో ఉబ్బితబ్బిబ్బు అయిపోయాడు. తన ఆనందాన్ని బ్యాంకు సహా ఉద్యోగులకు స్వీట్లు ఇచ్చి పంచుకున్నాడు. ఈ డబ్బులతో తన పిల్లల కోసం, కుటుంబం కోసం ఖర్చు పెడతానని రూపీందర్జిత్ సింగ్ అన్నారు.