ఇటీవల సినీ,రాజకీయ ప్రముఖులు మరణ వార్తలు వరుసగా వినిపిస్తున్నాయి. ఆరు నెలల వ్యవధి కాలంలో అనేక మంది ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. తెలుగులో విశ్వనాథ్, జమున, శరత్ బాబు వంటి లెజండరీ పర్సన్సే కాకుండా తారకరత్న, అప్ కమింగ్ నటుడు హరికాంత్ కన్నుమూశారు.
ఇటీవల సినీ,రాజకీయ, ఇతర ప్రముఖుల మరణ వార్తలు వరుసగా వినిపిస్తున్నాయి. ఆరు నెలల వ్యవధి కాలంలో అనేక మంది ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. తెలుగులో విశ్వనాథ్, జమున, శరత్ బాబు వంటి లెజండరీ పర్సన్సే కాకుండా తారకరత్న, అప్ కమింగ్ నటుడు హరికాంత్ కన్నుమూశారు. అలాగే ఇటీవల కాలంలో తమ సంగీతంతో ఓలలాడించిన గాయకులు కూడా తుది శ్వాస విడిచారు. వాణి జయరాం నుండి తెలంగాణ ఉద్యమ నేత సాయిచంద్ మరణించారు. ఇప్పుడు మరో గొంతుక మూగబోయింది. జానపద పాటలతో ఓలలాడించిన ప్రముఖ సింగర్ రంజిత్ ఆత్మహత్య చేసుకున్నాడు.
పంజాబీ జానపద గాయకుడు రంజిత్ సిద్దూ మరణం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. పంజాబ్ సంగ్రూర్ జిల్లాలోని సునమ్ పట్టణంలో శుక్రవారం రాత్రి అతడి మృతదేహాన్ని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసులు ఆత్మహత్యగా పేర్కొన్నారు. అనంతరం పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే అతడి కుటుంబ సభ్యులు వేధించడం వల్లే ఆయన బలవన్మరణానికి పాల్పడి ఉంటాడని ఆయన భార్య ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే అతడి మృతుడి మరణానికి బలమైన కారణాలు వెల్లడి కావాల్సి ఉంది.