కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల అభివృద్ధి కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. అలానే రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అనేక రకాల నిర్ణయాలను కూడా ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. తాజాగా మోదీ ప్రభుత్వం రైతులకు భారీ శుభవార్త చెప్పింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల అభివృద్ధి కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. అలానే రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అనేక రకాల నిర్ణయాలను కూడా ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. భారత ప్రధాని నరేంద్రమోదీ.. తొలిసారి అధికారం చేపట్టిన నాటి నుంచి రైతుల విషయంలో, వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పీఎం కిసాన్ యోజన్ వంటి కార్యక్రమాలను రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. తాజాగా మోదీ ప్రభుత్వం రైతులకు భారీ శుభవార్త చెప్పింది. ఎరువు బస్తాల కోసం ఇబ్బందులు పడుతున్న రైతులకు విముక్తి కలిగించే నిర్ణయం తీసుకుంది. మరి.. ఆ కీలక నిర్ణయం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
నేటి రోజుల్లో వ్యవసాయంలో ఎరువుల వినియోగం బాగా పెరిగి పోయింది. దీంతో పంట దిగుపడి కోసం రైతులు అధికంగా ఎరువులను ఉపయోగించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎరువుల వినియోగం బాగా పెరిగిపోవడం వలన రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఎరువుల బస్తాల కోసం గంటల కొద్ది క్యూలైన్ లో నిల్చొని మగ్గిపోతున్నారు. ఇలా ఎరువుల కోసం క్యూలైన్ లో నిల్చుకుని ప్రాణాలు వదిలిన రైతులు కూడా ఎందరో ఉన్నారు. ఎరువుల అందించే విషయంలో ఇబ్బందులు లేకుండా చూడాలని రైతులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నారు.
ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇఫ్కో సంస్థ తయారు చేసిన ద్రవరూపంలో ఉండే నానో యూరియాను మార్కెట్ లోకి తీసుకురావడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. 2021లో నానో యూరియా తీసుకురావడానికి కేంద్రం అనేక ప్రయత్నాలు చేసింది. చాలా కాలం తరువాత కేంద్రం ఆమోదంతో ఈనానో యూరియా మార్కెట్ లోకి రానుంది. దీనితో యూరియా బస్తాల కోసం ఎరువుల దుకాణాల ముందు రైతులు నిలబడాల్సిన పరిస్థితి పోయింది. అలాగే రానున్న వర్షకాలన్ని దృష్టిలో పెట్టుకొని ఎరువుల వినియోగం దృష్ట్యా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న రోజుల్లో నానో లిక్విడ్ డీఏపీని కూడా తీసుకురావడానికి ఆమోదం తెలిపింది.
ఈ విషయాన్ని కేంద్ర రసాయనాల, ఎరువుల శాఖమంత్రి మన్ సఖ్ మాండవీయ ట్వీట్ చేశారు. నానో యూరియా తర్వాత ఇప్పుడు నానో డీఏపీ కి కూడా అనుమతి లభించిందని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు. దీనివల్ల రైతులకు మేలు జరుగుతుందని మంత్రి తెలిపారు. ఒక్క డీఏపీ బస్తా ధర రూ.1350గా ఉంది. కానీ ద్రవ రూపంలో రాబోయే 500ఎమ్.ఎల్ డీఏపీ కేవలం రూ.600గా నిర్ణయించారు. అంటే 500 మి.లీ ద్రవరూప డీఏపీ ఒక్క బస్తా డీఏపీతో సమానం. నానో యూరియాను తయారు చేసిన ఇఫ్కో సంస్థనే ఈ లిక్విడ్ డీఏపీను తయారు చేయనుంది.
నానో యూరియాకు ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడం లేదు. సూక్ష్మ ద్రవ రూప యూరియా ఒక్కో బాటిల్ ను రూ.240 గా నిర్ణయించారు. అదే యూరియా బస్తా అయితే రూ.280గా ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రైతులకు మేలు జరగనుంది. నానో ఎరువుల వినియోగం వలన దేశానికి విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడంతో పాటు ప్రభుత్వానికి సబ్సిడీ భారీగా తగ్గించడానికి సాయ పడుతుందని నిపుణులు భావిస్తున్నారు. మరి.. కేంద్ర తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.