భిక్షాటన విషయంలో పోలీసులు కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై రోడ్ల మీద యాచకులు అడుక్కుంటే కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు. అసలేం జరిగిందంటే..!
భిక్షాటన అనేది ఎప్పటినుంచో వస్తోంది. మన దేశం అనే కాదు చాలా దేశాల్లోనూ ఇది ఉంది. అనేక మతాల వాళ్లు భిక్షాటన చేయడం చూడొచ్చు. అయితే ఒక్క సిక్కు మతంలో మాత్రమే భిక్షాటన కనిపించదు. ఆ మతంలో దాన్ని నేరంగా, తప్పుగా భావిస్తారట. ఇకపోతే, రోడ్ల మీద భిక్షాటన చేసేవారిని చూస్తూనే ఉన్నాం. పాదచారులు, వాహనదారుల దగ్గర అడ్డుకుంటారు. వాళ్లు కూడా తమకు తోచినంత ఎంతో కొంత డబ్బులు దానంగా ఇస్తుంటారు. అయితే కొందరు బెగ్గర్స్ మాత్రం పాదచారులు, వాహనదారుల్ని ఇబ్బంది పెడుతుంటారు. వారిని ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటారు. దీనిపై పోలీసులకు కంప్లయింట్లు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని నాగ్పూర్లో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్లతో పాటు బహిరంగ ప్రదేశాల్లో అడుక్కోవడంపై నాగ్పూర్ పోలీసు కమిషనర్ నిషేధం విధించారు. ఒకవేళ రూల్స్ను కాదని ఆయా ప్లేసుల్లో భిక్షాటన చేస్తే వారిపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. యాచకుల ఆగడాలపై కంప్లయింట్లు పెరగడంతో పాటు ఈ నెల 19, 20 తేదీల్లో జీ20 సదస్సు ఉన్న నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ 30వ తేదీ వరకు ఈ నిర్ణయం అమల్లో ఉండనుంది. మరి.. యాచకులు భిక్షాటన చేయకుండా నిషేధం విధించడం ఎంతవరకు సబబని మీరు భావిస్తున్నారు? ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.