భారత్ సహా చాలా దేశాల్లో హృద్రోగుల సంఖ్య రోజురోజుకీ ఎక్కువవుతోంది. ఉరుకుల పరుగుల జీవితంలో సరైన శారీరక శ్రమ లేకపోవడం, సమయానికి భోజనం చేయకపోవడం.. వ్యక్తిగత జీవితంలో ఉండే ఒత్తిళ్లు, ఆర్థిక సమస్యలు లాంటి పలు కారణాల వల్ల గుండెపోటు బారిన పడే వారి సంఖ్య బాగా పెరుగుతోంది. హఠాత్తుగా వచ్చే హార్ట్ ఎటాక్ వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సమస్యను ముందే గుర్తించకపోతే సడెన్గా వస్తే తట్టుకోవడం కష్టమని ఆరోగ్య నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. ఇదిలాఉంటే.. ఏదో పని మీద ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లిన వ్యక్తి గుండెపోటుతో కుర్చీలోనే కుప్పకూలాడు. అయితే అక్కడే ఉన్న ఓ ఐఏఎస్ అధికారి క్షణాల్లోనే స్పందించి సీపీఆర్ చేయడంతో ఆయన మళ్లీ ఊపిరి పీల్చుకున్నారు. పంజాబ్లోని చండీగఢ్లో జరిగిన ఈ ఘటన చోటుచేసుకుంది.
చండీగఢ్లోని సెక్టార్ 41కి చెందిన జనక్లాల్ అనే వ్యక్తి ఏదో పని మీద అక్కడి హౌసింగ్ బోర్డు కార్యాలయానికి వచ్చాడు. ఆఫీసులోని కుర్చీలో కూర్చుని అకస్మాత్తుగా దాంట్లోనే కుప్పకూలిపోయారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆరోగ్యశాఖ కార్యదర్శి యశ్పాల్ గార్గ్ తన సీటులోంచి లేచి పరుగున అక్కడికి వెళ్లి సీపీఆర్ చేశారు. దీంతో జనక్లాల్ కోలుకున్నారు. ఆ తర్వాత నీళ్లు అడిగి తాగడంతో అక్కడున్న వారందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియోను ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలీవల్ ట్విట్టర్లో షేర్ చేశారు. ప్రతి ఒక్కరూ సీపీఆర్ నేర్చుకోవాలని ఆమె ట్వీట్ లో రాసుకొచ్చారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. సీపీఆర్ చేసి వ్యక్తి ప్రాణాలు కాపాడిన యశ్పాల్ గార్గ్పై నెటిజన్స్ ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.
एक आदमी को हार्ट अटैक आया तो चंडीगढ़ के हेल्थ सेक्रेटरी IAS @Garg_Yashpal जी ने तुरंत CPR देकर उस आदमी की जान बचाई। उनके इस काम की जितनी सराहना की जाए उतनी कम है। हार्ट अटैक से जानें बचाई जा सकती हैं। हर इंसान को CPR सीखना चाहिए। pic.twitter.com/C7dWVsAoOI
— Swati Maliwal (@SwatiJaiHind) January 18, 2023