సాధారణంగా కుక్క అంటే ఎవరికైనా భయమే. చాలా మంది కుక్కలు గుంపుగా ఉన్నా.. ఒంటరిగా నడుస్తుంటే అటువైపు కుక్కలు తిరుగుతున్నయని తెలిసినా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇంట్లో పెంచుకునే కుక్కలకు తప్పనిసరి వ్యాక్సిన్ ఇస్తుంటారు. కానీ విధుల్లో తిరిగే కుక్కల పరిస్థితి వేరు.. అవి కరిస్తే చాలా ప్రమాదం అంటారు. ఒకవేళ కుక్క కరిస్తే వెంటనే హాస్పిటల్ కి వెళ్లి వైద్యం చేయించుకోవాలి.. లేదా చాలా ప్రమాదాలు కొనితెచ్చుకోవాల్సి వస్తుంది. ఓ వ్యక్తి తనని కుక్క కరిచిందని తెలిసినా నిర్లక్ష్యం వహించాడు. ఆరె నెలల తర్వాత అతనిలో విందైన మార్పులు చూసి అందరూ హడలిపోయారు. ఒడిశాలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఒడిశాకు చెందిన రాజేష్ బ్యూరా అనే వ్యక్తి రోడ్డు పై నడుచుకుంటూ వెళ్తుండగా ఓ కుక్క అతడిపై దాడి చేసి కరిచింది. ఈ సంఘటన ఆరు నెలల క్రితం జరిగింది. కుక్క కరిసిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు రాజేష్ ని వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాల్సిందిగా చెప్పారు. కానీ రాజేష్ మాత్రం తనకు ఏమీ కాదని.. తాను ఆరోగ్యంగా ఉన్నాడని వారి మాటలు పట్టించుకోలేదు. ఆరు నెలల తర్వాత రాజేష్ లో చిన్న చిన్న మార్పులు రావడం గమనించారు కుటుంబ సభ్యులు. కుక్కలా అరవడం.. కుక్కలా వాసన చూడటం లాంటివి చేయడంతో వెంటనే హాస్పిటల్ కి తీసుకు వెళ్లారు.
రాజేష్ ఆరోగ్య పరిస్థితి తీవ్రస్థాయిలో విషమించింది.. దీంతో అతన్ని కటక్ లో మెడికల్ కాలేజ్ కి పంపించి చికిత్స అందించారు. రాజేష్ లో వచ్చిన మార్పుల గురించి వైద్యులు స్పందించారు. కుక్క కరిచిన వెంటనే అతను సరైన వైద్య చికిత్స తీసకోకపోవడం వల్ల రాబిస్ వైరస్ అటాక్ చేసింది. కుక్క కరిచిన వెంటనే చికిత్స చేయించుకోవాలి.. లేని పక్షంలో బాధితుడికి హైడ్రోఫోబియా.. లేదా నీరు అన్నా భయం ఏర్పడుతుంది. తీవ్రమైన గొంతునొప్పితో కుక్కలా అరవడం లాంటివి చేస్తారన్నారు. ప్రస్తుతం అతనికి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.