గత కొంతకాలంగా అడవుల్లో ఉండే మృగాలు పల్లెలు, పట్టణాల్లోకి రావడంతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. కొన్నిసార్లు ఈ కూృర జంతువుల దాడుల్లో జంతువులే కాదు.. మనుషులు కూడా చనిపోతున్నారు.
ఈ మధ్యకాలంలో అడవుల్లో ఉండాల్సిన కూృరమృగాలు పట్టణాలు, గ్రామాల్లోకి వస్తున్నాయి. ముఖ్యంగా చిరుత, ఎలుగు బంట్లు, తోడేళ్లు వంటి కూృర జంతువులు ఊర్లోకి రావడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి వాటిని బంధించడంతో అంతా ఊపిరి పీల్చుకుంటారు. తాజాగా ఓ రైతు చిరుతపులిని తాళ్ళతో కట్టి తన బైక్ పై తీసుకు వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..
సాధారణంగా ఎవరైనా చిరుతపులిని చూస్తు బాబోయ్ అంటూ పరుగులు తీస్తుంటారు. కానీ ఓ రైతు మాత్రం ఆ చిరుతను తాళ్లతో కట్టేసి తన బైక్ పై ఫారెస్ట్ ఆఫీస్ కి తీసుకు వెళ్లి అధికారులకు అప్పగించిన ఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. కర్ణాటకలోని హసన్ జిల్లా అసిసికెరె తాలూకా బాగివాలు గ్రామానికి చెందిన వేణుగోపాల్ అలియాస్ ముత్తు అనే రైతు తన పొలానికి వెళ్తున్నాడు. అంతలోనే తొమ్మిదేళ్ల వయసు ఉన్న చిరుత పులి ఎదురుపడి అతనిపై దాడి చేసింది. ముత్తు కూడా ఎంతో ధైర్యం తెచ్చుకొని ఆ చిరుతపై ఎదురుదాడికి దిగాడు.
కొద్దిసేపు ఆ చిరుతతో పోరాడిన ముత్తు మొత్తానికి దాన్ని తాళ్లతో బంధించి తన బైక్ వెనుక వేసుకొని వెళ్లాడు. చిరుత పులిని తాడుతో బంధించి బైక్పై తీసుకురావడాన్ని చూసి విస్తుపోయిన గ్రామస్థులు, ఫారెస్ట్ అధికారులు షాక్ తిన్నారు. ప్రస్తుతం చిరుత వైద్యుల పర్యవేక్షణలో ఉందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఆ రైతు అవగాహన రాహిత్యంతోనే ఈ పని చేశాడని.. వేరే ఉద్దేశం ఏమీ లేదని అధికారులు స్పష్టం చేశారు. ఆ రైతుకు అటవీశాఖ అధికారులు కౌన్సిలింగ్ చేసి పంపించారు. వన్యప్రాణులు పై దాడులు చేయడం.. వాటిని బంధించి హింసించడం చట్టరిత్యా నేరం అని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దని రైతును హెచ్చిరించి పంపించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ಚಿರತೆಯನ್ನೇ ವ್ಯಕ್ತಿಯೋರ್ವ ಹಗ್ಗ ಕಟ್ಟಿ ದ್ವಿಚಕ್ರ ವಾಹನದಲ್ಲಿ ಹಾಕಿಕೊಂಡು ಅರಣ್ಯ ಇಲಾಖೆ ಕಚೇರಿಗೆ ತಂದ ಘಟನೆ ಹಾಸನ ಜಿಲ್ಲೆ ಅರಸೀಕೆರೆ ತಾಲೂಕಿನ ಬಾಗಿವಾಳು ಗ್ರಾಮದಲ್ಲಿ ನಡೆದಿದೆ.
#Hassan #Leopardattack #KarnatakaForestDepartment #ಹಾಸನ #ಚಿರತೆದಾಳಿ #ಕರ್ನಾಟಕಅರಣ್ಯಇಲಾಖೆ
Read more here: https://t.co/6EApwRvqAF pic.twitter.com/ym7NqFhPpA— kannadaprabha (@KannadaPrabha) July 15, 2023