ఉగ్రవాదులు, ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చిన కేసులో కశ్మీరీ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్ దోషిగా తేలాడు. ఈ మేరకు ఢిల్లీలోని జాతీయ దర్యాప్తు సంస్ధ(ఎన్ఎస్ఐఏ) కోర్టు తీర్పు వెలువరించింది. మాలిక్ ఇటీవల తన నేరాన్ని అంగీకరించడంతో న్యాయస్థానం అతడిని దోషిగా తేల్చింది. ఎన్ఐఏ కోర్టు అతడికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. జీవిత ఖైదుతో పాటు రూ. 10 వేలు జరిమానా కూడా విధించింది.
2017లో కశ్మీర్ లోయలో ఉగ్రవాదం, వేర్పాటువాద కార్యకలాపాలకు సంబంధించిన కేసులో మాలిక్ పై ఎస్ఐఏ కోర్టు కేసు నమోదు చేసింది. జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాద, చట్టవ్యతిరేక కార్యకలాపాల కోసం మాలిక్.. ఫ్రీడమ్ స్ట్రగుల్ పేరుతో నిధులు సమకూర్చాడని దర్యాప్తులో తేలింది. ఇందుకోసం మాలిక్ ప్రపంచవ్యాప్తంగా ఓ ప్రత్యేక వ్యవస్థనే ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు. దీంతో అతడిపై ఛార్జీషీట్ దాఖలు చేశారు. అతనితో పాటు పలువురు కశ్మీరీ వేర్పాటువాద నేతలపై కూడా అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసులో లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్, హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్లపై కూడా ఎన్ఎస్ఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. యాసిన్ మాలిక్ తనపై నమోదైన అన్ని కేసుల్లో నేరాన్ని కోర్టు ఎదుట అంగీకరించాడు.
A special NIA court awarded Kashmiri separatist leader #YasinMalik to life in prison for his role in a Jammu and Kashmir terror funding case. The special court’s decision came amid tight security at the Patiala House District Court in the national capital. https://t.co/CgTIgKyPHb
— BOOM Live (@boomlive_in) May 25, 2022
ఇక.. యాసిన్ మాలిక్ తీర్పు నేపథ్యంలో జమ్ముకశ్మీర్లోని సున్నిత ప్రాంతాలను పోలీసులు మూసివేశారు. శ్రీనగర్ లాల్ చౌక్లోని కొన్ని దుకాణాలతో సహా మైసుమా, పరిసర ప్రాంతాల్లోని చాలా దుకాణాలు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. పాతబస్తీలోని కొన్ని ప్రాంతాల్లో కూడా షాపులు బంద్ అయ్యాయి. మరోవైపు శాంతి భద్రతలు అదుపు తప్పకుండా ఉండేందుకు భారీగా భద్రతా దళాలను మోహరించారు.