దేశంలో పేలుళ్లకు పాల్పడిన నిందితులకు జైలు శిక్ష విధిస్తూ ఎన్ఐఎ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. అమాయకుల ప్రాణాలు బలిగొన్న నలుగురు ఉగ్రవాదులకు పదేళ్లు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.
ఉగ్రవాదులు దేశంలో కట్రలుపన్నుతూ అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నారు. ఆస్తులను, వనరులను ద్వంసం చేస్తూ నరమేధాన్ని సృష్టిస్తున్నారు. ఎప్పుడు ఎక్కడ దాడులు జరుగుతాయోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఉగ్రవాదుల చర్యలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ ధీటైన జవాబు ఇస్తోంది. కాగా దేశంలో పలు ప్రాంతాల్లో పేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాదులకు శిక్ష విధిస్తూ ఎన్ఐఎ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. నిందితులకు పదేళ్ల జైలు శిక్ష విధించింది. 2007, 2013లలో హైదరాబాద్ లో ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడిన విషయం తెలిసిందే. ఇప్పటికి ఆ ఘటనలు నగరవాసులను భయానికి గురిచేస్తుంటాయి.
ఇండియన్ ముజాహుద్దీన్ కుట్ర కేసులో ఎన్ఐఏ కోర్టు నేడు తీర్పును వెల్లడించింది. హైదరాబాద్, ఢిల్లీ నగరాలలో పేలుళ్లకు కారణమైన నిందితులకు పదేళ్లు జైలుశిక్ష విధించింది. దేశ వ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర కేసులో ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులకు శిక్ష పడింది. హైదరాబాద్కు చెందిన ఒబేదుర్ రహ్మన్తో పాటు, ధనీష్ అన్సారీ, అఫ్తాబ్ అలాం, ఇమ్రాన్ ఖాన్లకు ఎన్ఐఏ కోర్టు శిక్షలను ఖరారు చేసింది. నలుగురు ఉగ్రవాదులకు పదేళ్ల జైలు శిక్షను విధిస్తూ ఎన్ఐఏ కోర్టు తీర్పును వెలువరించింది. కాగా హైదరాబాద్, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పేలుళ్లకు దోషులు రెక్కీ నిర్వహించారు. హైదరాబాద్ కు చెందిన ఒబేద్ రహమాన్ బీహార్ కు చెందిన ధనిష్ అన్సారీ, ఆఫ్తాబ్ ఆలం, మహారాష్ట్రకు చెందిన ఇమ్రాన్ ఖాన్ లను 2013లో ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. కాగా 2007లో జరిగిన గోకుల్ చాట్, లుంబినీ పార్కు జంట పేలుళ్లు, 2013లో దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్లలో నిందితుల పాత్ర ఉంది. ఈ పేలుళ్లతో నగరం ఒక్కసారిగా ఉలికి పడింది. పేలుళ్ల దాటికి పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. వందల సంఖ్యలో పౌరులు తీవ్ర గాయాలపాలయ్యారు.