5G Network: ఇండియాకు త్వరలోనే 5G నెట్వర్క్ వచ్చేస్తోందట. ఇటీవల భారత ప్రభుత్వం 5G స్పెక్ట్రమ్ ఆవిష్కరణకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తుంది. రాబోవు కొద్ది నెలల్లో 5G సర్వీసు అందుబాటులోకి రానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం.. 5G వేలంలో స్పెక్ట్రమ్ ధరలకు పచ్చజెండా ఊపింది. ఇండియాలో 4G నెట్వర్క్ కంటే 5G నెట్వర్క్ ద్వారా 10 రెట్లు హైస్పీడ్ డేటాను యూజర్లు పొందే అవకాశం ఉన్నట్లు మంత్రివర్గం తెలిపింది.
ఇక కేంద్ర ప్రభుత్వం 5G స్పెక్ట్రమ్ వేలాన్ని ఆమోదించడంతో టెలికమ్యూనికేషన్స్ విభాగం(DoT) నోటీసు ఇన్విటింగ్ అప్లికేషన్ (NIA) ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతానికి 5G సర్వీసులు ఎప్పుడు మొదలవుతాయి అనేది సమాచారం లేదు. కానీ, 2022లోనే వినియోగదారులు 5G సేవలను పొందే అవకాశం ఉంది. గత నివేదికల ప్రకారం.. దేశంలో ఆగష్టు 15న నుండి 5G సేవలు ప్రారంభం కావచ్చని అన్నాయి.
ఇప్పుడైతే ఆ వాతావరణం కనిపించడం లేదు. ఇప్పుడున్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని 5G కమర్షియల్ ప్రకటన సెప్టెంబర్ నెలలో వెలువడే అవకాశం ఉందట. అదీగాక 5G సేవలు మొదలైతే అందరికీ అందుబాటులోకి రాకపోవచ్చు. 5జి సేవలు మెల్లగా ప్రారంభమై ఆ తర్వాత దేశమంతా విస్తరించడానికి కొన్నేళ్ల సమయం పట్టవచ్చు. ఇప్పటివరకూ 4Gలో కూడా ఇదే పరిస్థితిని చూశాం. 4G నెట్వర్క్ లేని కొన్ని ప్రాంతాలు ఇంకా ఉన్నాయి. మనం గమనించినట్లయితే.. లడఖ్ ప్రాంతంలో కొద్దిరోజుల కిందటే 4G నెట్వర్క్ అందుబాటులోకి వచ్చింది.
ఇక డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్(DoT) తాజా సమాచారం ప్రకారం.. దేశంలో 5G సేవలు మొదటగా 13 ప్రధాన నగరాల వరకు మాత్రమే రానున్నాయి. ఆ జాబితాలో.. అహ్మదాబాద్, బెంగుళూరు, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్, గురుగ్రామ్, జామ్ నగర్, హైదరాబాద్, పూణే, లక్నో, ముంబై, కోల్కతా ఉన్నట్లు తెలిపింది. మరి ఇప్పుడున్న నెట్వర్క్ లలో మొదటగా ఏది 5G సేవలు రిలీజ్ చేస్తుందనేది సమాచారం లేదు. ఇక 600 MHz, 700 MHz, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz, 3300 MHz 3300 MHz వంటి అనేక ఫ్రీక్వెన్సీ బ్యాండ్ లలో మొత్తం 72GHz స్పెక్ట్రమ్ వేలం జరుగనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. మరి ఇండియాలో 5G సేవల ప్రారంభంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
5G spectrum auction gets Cabinet approval.#5G #BharatKa5G pic.twitter.com/rVn6MMj9qd
— Mukul Sharma (@stufflistings) June 15, 2022
In another revolutionary step by our government, the Cabinet under the leadership of Hon. PM @narendramodi Ji has approved to conduct a spectrum auction for 5G capabilities. This will be a boon to our citizens and the development of our telecommunications sector for 5G. pic.twitter.com/U6qRecfYPX
— Jagat Prakash Nadda (@JPNadda) June 15, 2022