జార్ఖండ్ లో దారుణం చోటు చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీని దూషించాడనే ఆరోపణలతో రెచ్చిపోయిన బీజేపీ నేతలు.. ఓ వ్యక్తిని చితకబాదడమే కాక గుంజీలు తీయించి.. అతడి చేత ఉమ్మి నాకించారు. అంతటితో ఊరుకోక అతడి చేత బలవంతంగా జై శ్రీరామ్ అనిపించారు. సభ్య సమాజం తలదించుకునే ఈ సంఘటన బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీ సమక్షంలో చోటు చేసుకోవడం గమనార్హం. ఆ వివరాలు..
మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న భద్రతా వైఫల్యాలను నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు జార్ఖండ్ ధన్ బాద్ లో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమం జరుగుతున్న తరుణంలో నిరసనకారుల ముందు నుంచి వెళ్తోన్న ఓ ముస్లిం యువకుడు ప్రధాని నరేంద్ర మోదీని, జార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడు దీపక్ ప్రకాశ్ ని అసభ్య పదజాలంతో దూషించారని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. ఈ క్రమంలో సదరు యువకుడిని పట్టుకుని చితక బాదారు. గుంజీలు తీయించి.. ఉమ్మి నాకించారు. బీజేపీ ఎంపీ పీఎన్ సింగ్, ఎమ్మెలే రాజా సిన్హా సమక్షంలో ఈ దారుణం చోటు చేసుకోవడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
.@dc_dhanbad कृपया उक्त मामले की जाँच कर दोषियों पर सख्त कार्यवाई करते हुए सूचित करें।
अमन चैन से रहने वाले झारखण्डवासियों के इस राज्य में वैमनस्य की कोई जगह नहीं है।@dhanbadpolice @JharkhandPolice https://t.co/XXZFcu9mNo— Hemant Soren (@HemantSorenJMM) January 7, 2022
ఇది కూడా చదవండి : పంజాబ్ ఘటనపై ఘాటుగా స్పందించిన ప్రధాని మోదీఘీ
జార్ఖండ్ సీంఎ హేమంత్ సోరేన్ ఈ సంఘటనపై స్పందించారు. బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటుమాని హామీ ఇచ్చారు. ఈ మేరకు సీఎం ట్వీట్ చేశారు. అంతేకాక రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చలానుకునే వారిని.. జాతి విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించిన వారిని క్షమించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. బాధితుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడిన బీజేపీ కార్యకర్తల నివాసాల్లో సోదాలు జరిపి.. నలుగురిని అరెస్ట్ చేశారు.
ఈ సంఘటనపై కాంగ్రెస్ పార్టీ, జార్ఖండ్ ముక్తి మోర్చా ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం మూక దాడులను నివారించేందుకు కఠిన చట్టాలను తీసుకొచ్చామని చెబుతున్నా.. రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి : తెలంగాణ వ్యక్తిపై మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రశంసల జల్లు