ఈ అమ్మాయి ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ చదువుతోంది. అయితే, ఎప్పటిలాగే సోమవారం కూడా కాలేజీకి వెళ్లింది. క్లాస్ రూమ్ లో స్టూడెంట్స్ అంతా ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉండగా.. ఏం జరిగిందో తెలుసా?
ఈ అమ్మాయి పేరు తానీషా గాంధీ. ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ చదువుతోంది. ఈ బాలిక చదువుల్లో బాగా రాణించేది. అయితే, తానీషా గాంధీ ఎప్పటిలాగే ఇటీవల కాలేజీకి వెళ్లింది. క్లాస్ రూమ్ లో అందరితో పాటు ఎంతో ఆనందంగా కలిసి మెలిసి ఉత్సాహంగా గడిపింది. ఇక విరామ సమయంలో క్లాస్ రూమ్ లో ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. కానీ, ఉన్నట్టుండి తానీషా గాంధీ విషయంలో ఏం జరిగిందో తెలిస్తే కన్నీరు రాక మానదు. అసలేం జరిగిందంటే?
ఆమె పేరు తానీషా గాంధీ (17). గుజరాత్ లోని నవసారి పరిధిలోని పర్తాపూర్ కు చెందిన ఈ బాలికను తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదివిస్తున్నారు. అయితే, ప్రస్తుతం ఈ బాలిక స్థానికంగా ఉండే ఓ కాలేజీ లో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. ఇక ఎప్పటిలాగే తానీషా గాంధీ సోమవారం కాలేజీకి వెళ్లింది. విరామ సమయంలో క్లాస్ రూమ్ లో విద్యార్థులంతా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తానీషా గాంధీ ఉన్నట్టుండి ఒక్కసారిగా క్లాస్ రూమ్ లోనే కుప్పకూలింది.
తోటి విద్యార్థులు వెంటనే స్పందించి టీచర్లకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఆ బాలికను టీచర్లు స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. అప్పటికే ఆ బాలిక గుండెపోటుతో మరణించినట్లుగా నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న ఆ అమ్మాయి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు సైతం కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇదిలా ఉంటే, గత కొంత కాలం నుంచి దేశ వ్యాప్తంగా గుండెపోటు మరణాల సంఖ్య క్రమ క్రమంగా పెరిగిపోతుండడం విశేషం.