మీకు పాన్ కార్డు ఉంటే వెంటనే మీ కార్డును చెక్ చేసుకోండి. అలా అయితే పాన్ కార్డ్ కలిగిన వారు రూ.6 వేల వరకు జరిమానా కట్టాల్సి వస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..
ప్రస్తుత కాలంలో అన్ని డిజిటలైజేషన్ అయిన కారణంగా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అవసరం కంపల్సరీ అయింది. పాన్ కార్డ్, ఆధార్ నంబర్ తప్పనిసరిగా అనుసంధానం చేసుకోవాలి. దీని కోసం ప్రజలు అలర్ట్గా ఉండాలని ప్రభుత్వం ప్రకటనలు కూడా చేస్తుంది. పాన్, ఆధార్ లింక్ చేసుకోవడానికి చివరి తేది జూన్ 30,2023. ఈ గడువులోపు ఆధార్ నంబర్ లింక్ చేసుకున్న వారి పాన్ కార్డ్స్ మాత్రమే చెల్లుబాటు అవుతాయి. పాన్, ఆధార్ కార్డ్స్ అనుసంధానం కాకపోతే చాలా ఇబ్బందులకు గురవుతారు. జూన్ 30 తర్వాత ఇన్ యాక్టివేట్ పాన్ కార్డులు కలిగి ఉన్నవారికి రూ. 6వేలు జరిమానా కట్టవలసి వస్తుంది. అదెలా అంటే..
టాక్స్ చెల్లించేటప్పుడు పాన్ కార్డ్ లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చేయడం కుదరదు. ఐటీఆర్ ఫైల్ చేయడానికి కొన్ని రోజులు మాత్రమే ఉంది. పాన్ కార్డ్ లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చేయడం ఇబ్బంది అవుతుంది. జులై 31 లోపు ఐటీఆర్ ఫైల్ చేయని వారు ఫైన్ చెల్లించాలి. ఇదేకాకుండా.. మీ పాన్ కార్డ్, ఆధార్ లింక్ కాకపోతే దానిని రూ. 1000 జరిమానా కట్టి యాక్టివేట్ చేయించుకోవాలి. దీనికి ఒక నెల రోజుల సమయం పడుతుంది. అంటే ఐటీఆర్ ఫైల్ చేసేందుకు 20 రోజుల గడువు మాత్రమే ఉంది. మీరు ఇప్పుడు పాన్ కార్డ్ యాక్టివేట్ చేయించినా నెలరోజులుపడుతుంది కాబట్టి ఇంత తొందరగా యాక్టివేట్ చేయలేరు.
పాన్ కార్డ్, ఆధార్ లింక్ చేయనందుకు రూ.1000, జులై 31 తర్వాత ఐటీఆర్ ఫైన్ చేసినట్లయితే రూ. 5వేలు మొత్తం కలిపి రూ. 6వేల జరిమానా కట్టాల్సిందే. ఇది రూ. 5 లక్షల వరకు ఆదాయానికి వర్తిస్తుంది. ట్యాక్స్ చెల్లింపుదారులు వీలైనంత తొందరగా చెక్ చేసుకుంటే మంచిది. లేదంటే చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.