వారిద్దరూ ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత గాఢమైన అనుబంధం వారి మధ్య ఉంది. దాంతో పెళ్లి చేసుకుని.. జీవితాంతం సంతోషంగా జీవించాలని ఆశపడ్డారు. పెద్దల అంగీకారంతో.. ప్రేమను గెలిపించుకోవాలని భావించారు. తమ అనుబంధం గురించి తల్లిదండ్రులకు చెప్పారు. కానీ వారు అంగీకిరంచలేదు. ప్రేమికులు ఎన్ని విధాలా నచ్చ చెప్పినా.. పెద్దలు వారి ప్రేమకు ఎస్ చెప్పలేదు. దాంతో వారిని ఎదిరించి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక.. విడిపోయి బతకలేక.. ఆ ప్రేమికులు దారుణ నిర్ణయం తీసుకున్నారు. చావైనా.. బతుకైనా కలిసే అనుకున్న ఆ జంట.. కలిసి బతకలేనప్పుడు.. కలిసి చనిపోదామని భావించి.. ఆత్మహత్య చేసుకున్నారు. తమ వల్లే.. బిడ్డలు ప్రాణాలు తీసుకున్నారు అంటూ తల్లిదండ్రులు పశ్చాతప పడ్డారు. కానీ ఏం లాభం. బతికుండగా.. వారిని విడిదీశారు. దాంతో.. తమ తప్పుకు ప్రాయశ్చిత్తంగా చనిపోయిన బిడ్డల విగ్రహాలు తయారు చేయించి.. వాటికి వివాహం చేశారు. ఈ విషాదకర సంఘటన గుజరాత్లో చోటు చేసుకుంది. ఆ వివరాలు.
గుజరాత్, తపికి చెందిన గణేష్, రంజన.. ఇద్దరు ప్రేమించుకున్నారు. జీవితాంతం కలిసి ఉండాలని ఆశపడ్డారు. అయితే పెద్దలు వీరి ప్రేమకు అంగీకారం తెలపలేదు. ఎన్ని రకాలుగా నచ్చచెప్పినా.. పెద్దలు వీరి ప్రేమను అంగీకరించలేదు. దాంతో.. ఇక తాము కలిసి బతికే అవకాశం లేదని అర్థం చేసుకున్నారు. జీవితం మీద ఆశ వదిలేసుకున్నారు. కలిసి బతికే అవకాశం లేనప్పడు.. కనీసం చావులోనైనా కలిసుండాలని భావించారు. ఈ క్రమంలో 2022 ఆగస్టులో వారి స్వగ్రామలోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
అయితే తమ మొండితనం వల్లే.. నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాల్సిన బిడ్డలు.. ఇలా అర్థాంతరంగా తనువు చాలించారని తల్లిదండ్రులు పశ్చతాపపడటం ప్రారంభించారు. తాము చేసిన తప్పును సరిదిద్దుకోవడం కోసం బిడ్డలు చనిపోయిన ఆర్నేళ్ల తర్వాత వారి విగ్రహాలు తయారు చేయించి.. వాటికి వివాహం చేశారు. కనీసం ఇలాగైనా తమ తప్పకు పరిహారం లభిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రంజన తాత మాట్లాడుతూ.. ‘‘అబ్బాయి మాకు దూరపు బంధువు అవుతాడు. అందుకే వివాహానికి అంగీకరించలేదు. కానీ వారు ఒకరినొకరు ఎంతో ప్రేమించుకున్నారు. విడిపోవడం ఇష్టం లేక చనిపోయారు. అందుకే కనీసం వారి విగ్రాహాలకైనా వివాహం చేస్తే.. వారి ఆత్మలు శాంతిస్తాయనే ఉద్దేశంతో.. ఇలా విగ్రహాలకు పెళ్లి చేశాం’’ అని తెలిపాడు.
ఈ వార్త తెలిసిన జనాలు.. బతికుండగా.. ఒప్పుకోలేదు.. చనిపోయాక ఇలా విగ్రహాలకు వివాహం చేయడం వల్ల లాభం ఏంటి.. మీ మూర్ఖత్వం కారణంగా రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి.. ఏం సాధించారు.. బతికుండగా చేయనిది.. చనిపోయాక చేస్తే.. ఏం లాభం అంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. మరి నిజంగానే బతికుండగా విడదీసి.. చనిపోయాక ఇలా వివాహం చేయడం సరైనా పనేనా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.