యూట్యూబ్ ద్వారా ఎంతోమంది లక్షల్లో ఆర్జిస్తున్నారు. కటిక పేదరికం నుంచి వచ్చి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల కంటే ఎక్కువగా సంపాదిస్తున్న వారు అనేక మంది ఉన్నారు. కూలి పని చేసుకుంటూనో ఉద్యోగం చేసుకుంటూనో ఖాళీ సమయంలో యూట్యూబ్ ఛానల్ నడుపుతూ డబ్బులు సంపాదించుకునేవారు ఉన్నారు. అయితే ఆ ఉద్యోగం చేసే వాళ్ళు మాత్రం యూట్యూబ్ ఛానల్ ని నిర్వహించకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే యూట్యూబ్ ఛానళ్లను బంద్ చేయాలని హుకుం జారీ చేసింది.
ఈరోజుల్లో ఒక పని చేస్తూ మరో పని చేసే వాళ్ళు చాలా మందే ఉన్నారు. పెరిగిపోయిన ఖర్చులతో బతకాలంటే మనుగడ కష్టమని చాలా మంది వేరే ఆదాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. కొంతమంది యూట్యూబ్ ని ఆదాయ వనరుగా ఎంచుకుంటున్నారు. యూట్యూబ్ లో వీడియోలు అప్ లోడ్ చేస్తూ లాభాలను ఆర్జిస్తున్నారు. చిన్న, పెద్ద, పేద, ధనిక, ప్రైవేట్, గవర్నమెంట్ ఉద్యోగులు అని తేడా లేకుండా అందరూ యూట్యూబ్ ఛానల్స్ ని నడుపుతూ డబ్బు సంపాదిస్తున్నారు. అయితే ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులు యూట్యూబ్ ఛానల్స్ ని నడపడానికి వీల్లేదని, తక్షణమే యూట్యూబ్ ఛానల్స్ ను నిలిపివేయాలని కేరళ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వ ఉద్యోగులకు యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకునే అనుమతి లేదని, వీడియోలు అప్ లోడ్ చేసి డబ్బు సంపాదించడానికి వీల్లేదని కేరళ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది. లేబర్ అండ్ స్కిల్స్ డిపార్ట్మెంట్ కి చెందిన డిప్యూటీ సెక్రటరీ ఆర్ఎస్ రుసి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఇంటర్నెట్ మరియు సోషల్ మీడియాను వాడుకునే స్వేచ్ఛ ఉద్యోగులకు ఉంటుందని.. అయితే యూట్యూబ్ ఛానల్స్ ద్వారా సంపాదించడానికి గానీ.. అత్యధిక సబ్ స్క్రైబర్స్ ను కలిగి ఉండడం గానీ అనుమతించబడదని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఒకవేళ ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి యూట్యూబ్ ఛానల్స్ ని నిర్వహిస్తే.. అది కేరళ ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తన నియమాల చట్టం 1960కి విరుద్ధమని అన్నారు.
చట్టాన్ని ఉల్లఘించినట్టు అవుతుందని కేరళ సర్కార్ ఆదేశాల్లో పేర్కొంది. ప్రస్తుతం ఉన్న నియమాల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు యూట్యూబ్ ఛానల్ నడుపుకునే అనుమతి ఉండదని స్పష్టం చేసింది. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయమని అగ్నిమాపక సిబ్బంది అభ్యర్థించగా ఆ అభ్యర్థనను తిరస్కరించిన తర్వాత ప్రభుత్వం ఈ ఆదేశాలను జారీ చేసింది. ఎవరికైనా యూట్యూబ్ ఛానల్స్ ఉంటే ఛానల్స్ ను మూసివేయాలని ఉద్యోగులను కోరింది. ప్రభుత్వ ఉద్యోగులు సోషల్ మీడియాలో గడిపే సమయాన్ని తగ్గించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పోస్ట్ చేయడం గానీ, ప్రజలను అభిప్రాయాలను అడగడం గానీ చేయడం వల్ల ప్రభుత్వానికి ఇబ్బందికరంగా ఉంటుందన్న కారణంతో 2021లో ప్రభుత్వ ఉద్యోగులకు ఆ అలవాటును మానుకోవాలాంటూ సూచించింది. పని సమయంలో సోషల్ మీడియాలో ఫోటోలు, పోస్టులు, అభిప్రాయాలు, ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే పోస్టులు పోస్ట్ చేస్తే చర్యలు తప్పవని చర్యలు తప్పవని హెచ్చరించింది. తాజాగా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ ని నడపకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. మరి కేరళ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు ఇలా ఆదేశాలు జారీ చేయడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.