ఇటీవల డ్రైవింగ్ లైసెన్స్ కు సంబంధించిన రూల్స్ సవరిస్తూ కొత్త రూల్స్ ని అమలులోకి తీసుకు రానుంది కేంద్ర ప్రభుత్వం. నీతోదీంతో వాహనదారులకు ఎంతో ప్రయోజనం కలిగనుంది. ప్రతి వాహనదారుడు కూడా డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఇక డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఎవరైనా వాహనం నడిపారు అంటే ఏకంగా ట్రాఫిక్ పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేసి భారీ జరిమానాలు విధిస్తున్నారు ఈ నేపథ్యంలో చాలా మంది డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడానికి ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు.
అయితే సాధారణంగా డ్రైవింగ్ లైసెన్స్ కావాలి అనుకున్న వారు ముందుగా సమీపంలో ఉన్న ఆర్టీఏ ఆఫీస్ కి వెళ్లి అక్కడ వివిధ రకాల నిబంధనల ప్రకారం ముందుగా లర్నింగ్ లైసెన్స్ తీసుకునేవారు. వాహనదారుడు కేంద్ర ప్రభుత్వం విధించిన రోడ్డు నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఆర్టిఏ ఆఫీస్ కి వెళ్లి పెద్ద క్యూలైన్లో నిలబడి లెర్నింగ్ లైసెన్స్ తీసుకోవడానికి వాహనదారులు ఎంతో ఇబ్బంది పడేవారు. ఇక ఒకప్పటిలా లర్నింగ్ లైసెన్స్ తీసుకోవడానికి ఆర్టిఏ ఆఫీస్ కి వెళ్లి అక్కడ క్యూలైన్లో గంటల తరబడి నిలబడాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండే లెర్నింగ్ లైసెన్స్ పొందేందుకు అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధన జూలై 1 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది.
ఇక కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ కి అనుగుణంగానే అటు సాఫ్ట్వేర్ లో కూడా మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. కొత్త రూల్ ప్రకారం ఇంట్లో ఉండే లర్నింగ్ లైసెన్స్ తీసుకోవాలి అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ కి వెళ్లి అక్కడి నుంచి లర్నింగ్ లైసెన్స్ కోసం అప్లై చేసుకుంటే సరిపోతుంది లర్నింగ్ లైసెన్స్ కోసం ఫీజు కూడా ఆన్లైన్లోనే చెల్లించాల్సి ఉంటుంది ఇక దీనికి సంబంధించిన టెస్ట్ కూడా ఆన్లైన్లోనే పూర్తి చేయొచ్చు. లర్నింగ్ లైసెన్స్ కోసం ఆర్టీవో ఆఫీస్ కి వెళ్ళనక్కర్లేదు. ఇక ఎప్పటి లాగానే టెస్ట్ లో పాస్ అయిన వాళ్ళు లర్నింగ్ లైసెన్స్ పొందేందుకు వీలుంటుంది. ఈ కొత్త సేవలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.