గత కొంత కాలంగా హిమాలయా పరిసర ప్రాంతాల్లో పలుమార్లు భూకంపాలు కలకలం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ ఇతర ప్రాంతాల్లో వరుస భూకంపాలతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. అయితే భూ అంతర్భాగంలో టెక్టానిక్ ప్లేట్లు పలుమార్లు కదలికలు సంబవించడం వల్లనే భూ ప్రకంపనలు వస్తున్నాని నిపుణులు తెలుపుతున్నారు. కాకపోతే ఇటీవల వచ్చిన భూ కంపాల వల్ల పెద్దగా ప్రాణహాని జరగకపోయినా ఆస్తినష్టం బాగానే జరిగినట్లు అధికారులు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే దేశ ప్రజలు కొత్తసంవత్సరం వేడుకల్లో సంతోషంగా ఉంటే.. హర్యానా, ఢిల్లీ ప్రజలు అర్ధరాత్రి భూ ప్రకంపనలు రావడంతో భయంతో వణికిపోయారు. వివరాల్లోకి వెళితే..
దేశంలో అందరూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఆనందోత్సాహాలతో ఉన్న సమయంలో హర్యానా, ఢిల్లీ-ఎన్సీఆర్లోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంబవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 3.8 గా నమోదు అయ్యింది. హర్యానా లోని ఝజ్జార్ ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లుగా అధికారులు కనుగొన్నారు. ఇది భూ ఊపరితలానికి 5 కిలోమీటర్ల లోతున ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కొత్త సంవత్సరానికి అయితే ఈ భూ ప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అంటున్నారు. ఎన్నో ఆశలతో ఆనందంతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న వేల భూకంపం రావడం ఢిల్లీ ప్రజలు షాక్ తిన్నారు.
నవంబర్ లో కూడా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భూకంపం సంబవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.4గా నమోదయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారులు తెలిపారు. కాకపోతే ఆ సమయంలో ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఇటీవల కాలంలో భూమి లోపల పలకాలు తరచూ కదులుతూ ఉండటం వల్ల అవి సరి అవుతూ ఉంటాయి. అందువల్లే ఉత్తరాది రాష్ట్రాల్లో భూకంపాలు వస్తూ ఉంటాయి. అయితే రిక్టర్ స్కేల్ తీవ్రత 4 ఉంటే.. వాటిని చిన్న భూకంపాలుగా పరిగణిస్తుంటారు.