ఇటీవల ప్రపంచంలో భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. భారీ భూ కంపాల వల్ల ఆస్తి, ప్రాణ నష్టం కూడా భారీగానే సంబవిస్తుంది. ఇటీవల ఆఫ్ఝనిస్థాన్ లో జరిగిన భూ కంపం వల్ల వెయ్యి మందికి పైగా మృతి చెందగా.. వేల సంఖ్యలో గాయపడ్డారు. భారత్ లో కూడా ఇటీవల వరుస భూకంపాలు భయపెడుతున్నాయి. అరుణాచల్ప్రదేశ్లో భూకంపం రావడంతో జనాలు భయంతో పరుగులు తీశారు. భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతోగా నమోదు అయ్యింది.
ఈ విషయం నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సిఎస్) తెలిపింది. ఇది అరుణాచల్ ప్రదేశ్లోని పాంగిన్కు ఉత్తరాన 1176 కిలోమీటర్ల దూరంలో భూ ప్రకంపణలు జరిగినట్లు ఎన్సీఎస్ ఒక నివేదికలో పేర్కొంది. భూమి కంపిస్తున్న సమయంలో ఇళ్లలో ఉన్న జనాలు ఒక్కసారే బయటకు పరుగులు తీశారు. భూకంపం ప్రభావం వల్ల ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు చెప్పారు.
Earthquake of Magnitude:5.3, Occurred on 15-04-2022, 06:56:19 IST, Lat: 38.62 & Long: 97.05, Depth: 30 Km ,Location: 1176km N of Pangin, Arunachal Pradesh, India for more information Download the BhooKamp App https://t.co/iR87Q064Pm @ndmaindia @Indiametdept pic.twitter.com/5Pbw0IGxp7
— National Center for Seismology (@NCS_Earthquake) April 15, 2022