ఇటీవల ప్రపంచంలో భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. భారీ భూ కంపాల వల్ల ఆస్తి, ప్రాణ నష్టం కూడా భారీగానే సంబవిస్తుంది. ఇటీవల ఆఫ్ఝనిస్థాన్ లో జరిగిన భూ కంపం వల్ల వెయ్యి మందికి పైగా మృతి చెందగా.. వేల సంఖ్యలో గాయపడ్డారు. భారత్ లో కూడా ఇటీవల వరుస భూకంపాలు భయపెడుతున్నాయి. అరుణాచల్ప్రదేశ్లో భూకంపం రావడంతో జనాలు భయంతో పరుగులు తీశారు. భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతోగా నమోదు అయ్యింది. […]