ఈ మద్య కాలంలో రైలు ప్రమాదాలు వరుసగా జరుగుతున్నాయి. సాంకేతిక లోపాలు కొన్ని అయితే.. మానవ తప్పిదాలు మరికొన్ని. ఈ రోజు ఉదయం హౌరా-సికింద్రాబాద్ ఫలక్నూమా ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం తీవ్ర కలకలం రేపింది.
దేశంలో ఈ మద్య వరుస రైలు ప్రమాదాలు ప్రజలను కలవర పెడుతున్నాయి. గత నెల ఒడిశాలో బాలాసోర్లోని బహనాగా బజార్ స్టేషన్కు సమీపంలో మూడు రైళ్లు నిమిషాల వ్యవధిలో ఢీ కొన్నాయి. ఈ ఘటనలో 291 మంది మరణించగా, 1000 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన మరువక ముందే మరికొన్ని ఘటనలు జరిగాయి. శుక్రవారం ఉదయం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం సంచలనంగా మారింది. ఈ ఘటన మరువక ముందే ముంబయి – సికింద్రాబాద్ దేవగిరి ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే..
ఈ రోజు ఉదయం హౌరా-సికింద్రాబాద్ ఫలక్నూమా ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం జరిగిన సంఘటనతో దేశం ఒక్కసారే ఉలిక్కిపడింది. ఈ ఘటన మరువక ముందే.. ముంబాయి-సికింద్రాబాద్ దేవగిరి ఎక్స్ ప్రెస్ ట్రైన్ కి ప్రమాదం తప్పింది. కొంతమంది గుర్తు తెలియని దుండగులు పట్టాలపై రాళ్లతో నింపి డ్రములను ఉంచారు. ముందుగానే ప్రమాదాన్ని పసిగట్టిన లోకో పైలట్ వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేసి ప్రమాదం నుంచి తప్పించాడు. ఈ ఘటన మహారాష్ట్ర జల్నా జిల్లాలో చోటు చేసుకుంది. దేవగిరి ఎక్స్ ప్రెస్ రైలు శుక్రవారం ఉదయం సతోనా- ఉస్మాన్ పూర్ స్టేషన్ ల మధ్య వెళ్తుండగా లోకో పైలట్ కి పట్టాలపై ఏదో వస్తువులు ఉండటం గమనించాడు. వెంటనే రైలు ఆపి కిందకు దిగి వెళ్లి చూడగా ట్రాక్ మధ్యలో రాళ్లతో నింపిన డ్రమ్ములు కనిపించాయి.
లోకో పైలట్ వెంటనే రైల్వే భద్రతా సిబ్బంది కి సమాచారం అందించారు. ఆపీపీఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని డ్రమ్ములను తొలగించారు. ట్రాక్ ని క్లీయర్ చేయడంతో రైలు సికింద్రబాద్ కి బయలుదేరింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ డ్రమ్ములు ఎవరు పెట్టి ఉంటారు..? ఇందులో ఏదైనా విద్రోహ కుట్ర దాగి ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని తెలిపారు అధికారులు.
Maha: Drum filled with stones kept on railway track; train driver applies emergency brakes https://t.co/r4v3UB1zLQ
— Newsd (@GetNewsd) July 7, 2023