కోరమాండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గల కారణాలను వెల్లడించారు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్. కవచ్ వ్యవస్థ పైనా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు.
ఒడిశాలోని బాలాసోర్ దగ్గర జరిగిన ఘోర రైలు ప్రమాదం దేశ ప్రజల్ని కలచివేసింది. ఈ యాక్సిడెంట్లో మృతుల సంఖ్య దాదాపుగా 300కి చేరువలో ఉంది. ఈ ఘటనపై దేశంలోని రాజకీయ, సినీ, క్రీడా సెలబ్రిటీలతో పాటు విదేశీ ప్రముఖులు కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన తమను షాక్కు గురి చేసిందని చెబుతూ, మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో ఈ ఘటనపై నెటిజన్స్ చర్చకు తెరలేపారు. రైల్వే శాఖ అధికారుల నిర్లక్ష్యం, తప్పిదం వల్లే ఈ విషాదం జరిగిందని ఫైర్ అవుతున్నారు. రైల్వే ప్రమాదాలను అరికట్టేందుకు తీసుకొచ్చామన్న ‘కవచ్’ వ్యవస్థ ఏమైందని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ప్రయాణికుల భద్రత కోసం రైల్వే శాఖ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన ఘటనా స్థలాన్ని తాజాగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సందర్శించారు.
ఘటనా స్థలంలో ట్రాక్ పునరుద్ధరణ పనులను మంత్రి అశ్వినీ వైష్ణవ్ పర్యవేక్షించారు. అనంతరం ఈ ప్రమాదానికి గల కారణాలపై ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. యాక్సిడెంట్ వల్ల పాడైన ట్రాక్ పనుల్ని పునరుద్ధరిస్తున్నామని చెప్పారు. బుధవారం ఉదయం కల్లా మిగిలిన పనుల్ని పూర్తి చేసి, రైళ్ల రాకపోకలు కొనసాగేలా చేస్తామని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ యాక్సిడెంట్కు సంబంధించిన కారణాలపై ఇప్పటికే రైల్వే సేఫ్టీ కమిషనర్ దర్యాప్తు చేసి, నివేదికను పూర్తి చేసిందన్నారు. ఆ రిపోర్ట్ తమకు అందాల్సి ఉందని పేర్కొన్నారు. అయితే నివేదిక రావడానికి ముందే బాధ్యులను గుర్తించామన్నారు. ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ను మార్చడం వల్లే ప్రమాదం జరిగిందని అశ్వినీ వైష్ణవ్ వివరించారు. కవచ్కు, ట్రైన్ యాక్సిడెంట్కు సంబంధం లేదని స్పష్టం చేశారు.
#WATCH | The commissioner of railway safety has investigated the matter and let the investigation report come but we have identified the cause of the incident and the people responsible for it… It happened due to a change in electronic interlocking. Right now our focus is on… pic.twitter.com/UaOVXTeOKZ
— ANI (@ANI) June 4, 2023