గత కొన్ని రోజులుగా ఢిల్లీలో చేపట్టిన రైతు దీక్షకు టీఆర్ఎస్ మద్దతు పలుకుంతుంది. ఈ నేపథ్యంలో యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన దీక్షకు ముఖ్యమంత్రి కేసీఆర్, రాకేశ్ తికాయత్ హాజరయ్యారు. కేంద్రం రైతుల పట్ల వివక్ష చూపిస్తుందని.. ప్రజలు అంతా గమనిస్తున్నారని కేసీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేతలు ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. కాగా, యాసంగిలో పండిన వరి ధాన్యం కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తుంది. దేశం మొత్తం పంజాబ్ తరహాలోనే ధాన్యం సేకరణను జరపాలని కోరుతుంది. ఇక ఢిల్లీలో చేపట్టిన నిరసనకు దేశ వ్యాప్తంగా రైతు సంఘాలు రావాలని ఆహ్వానించినట్లు తెలుస్తుంది.
దేశంలో ఏ రైతు నష్టపోకూడదు.. రైతులకు న్యాయం జరిగేలా దేశమంతా ఒకే విధానాన్ని ధాన్యం సేకరణలో అమలు పర్చాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. కాగా, ఢిల్లీలో తెలంగాణ భవన్ సహా.. ఇతర ప్రాంతాల్లోనూ టీఆర్ఎస్ ఫ్లెక్సీలు భారీగా వెలిశాయి. తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను ఢిల్లీలో మోహరించటంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
Telangana CM K Chandarsekhar Rao is joined by BKU leader Rakesh Tikait at the ‘dharna’ staged by Telangana MPs, MLCs, and other leaders against the Centre’s paddy procurement policy, in Delhi pic.twitter.com/lVFoi1XoNv
— ANI (@ANI) April 11, 2022