కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక కొన్ని విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగానే తీసుకొచ్చిన బిల్లు జీఎస్టీ (GST).”ఇది సామాన్యుల బిల్లు” అని జీఎస్టీని సభలో ప్రవేశపెట్టే ముందు బీజేపీ నాయకులు చెప్పిన మాటా. ఈక్రమంలోనే ఇటీవల జరిగిన 47వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొన్ని నిత్యవసరాలపై జీఎస్టీని పెంచారు. ఇలా టాక్స్ పెంచడం వల్ల మా అమ్మ నన్ను కొడుతోంది అని 1వ తరగతి పాప ఏకంగా ప్రధాని మోదీకే లేఖ రాసింది. మరి ఆ వార్త కు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
జీఎస్టీ బాదుడుకు పెద్దవారే కాదు.. చిన్న పిల్లలు సైతం బాధితులుగా మారారు. అవును ఈ చిన్న పిల్ల మోదీకి రాసిన లేఖ చదివితే మీకే అర్ధం అవుతుంది. ప్రస్తుతం ఈ లేఖ నెట్టింట వైరల్ గా మారింది. ఉత్తరప్రదేశ్ లోని కనౌజీ జిల్లాలో 1వ తరగతి చదివే పాపకు జీఎస్టీ వల్ల వచ్చిన కష్టం ఏంటో ఇప్పుడు తెలుసుకుందా.
చిన్న పాప పేపర్, పెన్సిల్ తీసుకుని ప్రధానికి ఇలా రాసింది.. ”నా పేరు కృతి దూబే. నేను 1వ తరగతి చదువుతున్నాను. మోదీజీ మీరు విపరీతంగా ధరల పెంచుతున్నారు. ఈ క్రమంలోనే నా పెన్సిల్, రబ్బరు కూడా ఖరీదైనవిగా మారిపోయాయి. అంతే కాదు నేను ఇష్టంగా తినే నా మ్యాగీ ధర కూడా పెరిగింది. స్కూల్లో ఎవరో నా పెన్సిల్ దొంగిలించారు. ఇప్పుడు మా అమ్మ నన్ను కొట్టింది. పెన్సిల్ ఎక్కడ అని అడుగుతున్నారు. నేను ఏమి చేయాలి? మీరే చెప్పండంటూ నేరుగా ప్రధానికే లేఖ పేరుతో తన బాధని అక్షరాల రూపంలో రాసింది. మరి ఈ చిన్నారి తల్లికి వచ్చిన కష్టం గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: చికెన్ రుచిగా వండలేదని భార్యను కొట్టి చంపిన భర్త!
ఇదీ చదవండి: డ్యాన్స్ చేస్తూ కింద పడ్డ హీరోయిన్.. వీడియో వైరల్!