భార్యాభర్తల మధ్య జరిగిన చిన్నపాటి గొడవలకు కొందరు దారుణాలకు తెగబడుతున్నారు. చెప్పిన పని చేయలేదని భర్త, అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని భార్య.. ఇలా క్షణికావేశంలో హత్యలకు తెగబడుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా చికెన్ రుచిగా వండలేదని ఓ భర్త భార్యను దారుణంగా హత్య చేసి అనంతరం తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెంగుళూరులో చోటు చేసుకున్న ఈ ఉదాంతం స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.
పోలీసుల కథనం ప్రకారం.. బెంగుళూరులోని ఓ ప్రాంతంలో భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. అయితే ఇటీవల భర్త తనకు ఇష్టమని భార్యను చికెన్ కబాబ్ వండమని అడిగాడు. భర్త కోరిక మేరకు కాదనకుండా భార్య తనకు వచ్చిన స్టైల్ లో వండి భర్తకు పెట్టింది. దీనిని తిని చూసిన భర్తకు కబాబ్ రుచిగా అనిపించలేదు. ఇక ఇదే విషయమై భర్త భార్యతో గొడవకు దిగాడు. ఆ గొడవ చివరికి ఇద్దరు కొట్టుకునే స్తాయికి వెళ్లింది. కోపంతో ఊగిపోయిన భర్త ఇంట్లో ఉన్న ఐరాన్ రాడ్ తో భార్యను కొట్టి భార్యను దారుణంగా హత్య చేశాడు.
ఈ దాడిలో భార్య అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. భార్య ప్రాణాలు పోవడంతో భర్తకు ఏం చేయాలో అర్థం కాలేదు. దీంతో భయపడి వెంటనే చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణం స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. భర్త క్షణికావేశానికి రెండు ప్రాణాలు పోవడం అనేది తీవ్ర విషాదంగా మారింది. క్షణికావేశంలో భర్త తీసుకున్న ఈ నిర్ణయాలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.