సాధారణంగా చిన్నపిల్లలు తెలియకనో.. ఆటల్లో పడి కాయిన్స్, చిన్న చిన్న వస్తువులును మింగే సంఘటనలు కోకొల్లలు. ఇలాంటి సంఘటనల్లో పలువురు చిన్నారులు మృతి చెందడం కూడా జరిగింది. అయితే పొరపాటున చిన్న చిన్న వస్తువులు మింగిన సంఘటనల గురించే ఇప్పటి వరకు మనం విన్నాం. కానీ ఇప్పుడు మీరు ప్రపంచలో ఎక్కడా చోటు చేసుకోనటువంటి సంఘటన గురించి తెలుసుకోబోతున్నారు. ఓ వ్యక్తి టీ తాగుతూ.. దాంతో పాటు గ్లాస్ కూడా మింగేశాడట. నమ్మబుద్ధి కాకపోయినా.. ఇదే వాస్తవం అంటున్నాడు. పోనీ ఇలా చెప్తున్న వ్యక్తి చిన్న పిల్లాడు అయితేనన్న అతడి మాటలు నమ్మేవారు కాదు. కానీ బాధితుడు 55 ఏళ్ల వ్యక్తి కావడంతో నమ్మాల్సి వస్తోంది. అసలు నోట్లో గ్లాస్ ఎలా పట్టిందో అర్థం కాక వైద్యులు తలప పట్టుకుంటున్నారు. ఈ వింత సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి..
ఈ సంఘటన బిహార్ లోని ముజఫర్పుర్ జిల్లా మడిపూర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. 55 ఏళ్ల ఓ వ్యక్తి కొన్ని రోజులుగా కడుపునొప్పితో తీవ్రంగా బాధపడసాగాడు. ఓ రోజు భరించలేని నొప్పితో విలవిల్లాడసాగాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు. అతడిని గమనించిన వైద్యులు వెంటనే అతడికి సీటీ స్కాన్ చేశారు. ఇక ఆ రిపోర్టులు చూసి.. షాక్ తో బిగుసుకుపోయారు. ఆ టెస్ట్ల్లో బాధితుడి కడుపులో గ్లాసు ఉన్నట్టుగా గుర్తించారు వైద్యులు. ఏకంగా గ్లాసు కడుపులో ఉండడం చూసి డాక్టర్లు ఎలా లోపలికి వెళ్లిందని ప్రశ్నించారు.దానికి అతడు చెప్పిన సమాధానం విని షాకయ్యారు వైద్యులు. సదరు వ్యక్తి టీ తాగేటప్పుడు.. దాంతో పాటు గ్లాస్ ని కూడా మింగేశానని చెప్పాడు. తొలుత వైద్యులు అతడికి ఎండోస్కోప్ చేసి గ్లాస్ ను తొలగించే ప్రయత్నం చేశారు. కానీ సాధ్యం కాకపోవడంతో.. చివరకు ఆపరేషన్ చేసి గ్లాస్ ను తొలగించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. అయితే టీ తాగుతుండగా గ్లాస్ను మింగేసినట్టు చెప్పిన రోగి మాటలు నమ్మశక్యంగా లేవని వైద్యులు అంటున్నారు. ఎందుకంటే సన్నగా ఉండే ఆహార నాళంలో గ్లాసు పట్టే అవకాశం లేదని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. అసలు గ్లాస్ కడపులోకి ఎలా వెళ్లి ఉంటుందో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఈ వింత సంఘటనపై మీ అభప్రయాలను కామెంట్స్ రూపంలో తెలపండి.