ప్రభుత్వంపై సెటైరికల్ సాంగ్ పాడినందుకు ప్రముఖ సింగర్కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మూడ్రోజుల్లోగా దీనిపై సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పోలీసులు స్పష్టం చేశారు.
ఉత్తర్ ప్రదేశ్లో ఇప్పుడు ఓ పాట బాగా వైరల్ అవుతోంది. ప్రముఖ భోజ్పురి గాయని నేహా సింగ్ రాథోడ్ ఆలపించిన ఆ పాటపై యూపీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇటీవల కాన్పూర్లో అక్రమ ఇళ్ల తొలగింపు, తల్లీకూతుళ్లు మృతి చెందడం అందుకు కారణమైంది. అయితే ఈ ఘనటపై యోగి ఆదిత్యనాథ్ సర్కార్ను టార్గెట్ చేస్తూ నేహా సింగ్ ‘యూపీ మే కా బా’ అనే ఓ వీడియో సాంగ్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్తా వైరల్ అయింది. దీంతో ఈ సాంగ్ మీద యూపీ పోలీసులు సీరియస్ అయ్యారు. సమాజంలో ఈ పాట అసమ్మతి, ఉద్రిక్తతలు సృష్టించేలా ఉందంటూ ఆరోపించించారు.
ఒక్క పాటకు ఏడు ప్రశ్నలను సంధిస్తూ నేహా సింగ్కు యూపీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీనిపై మూడ్రోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. జవాబు సరిగ్గా లేకపోతే చట్టప్రకారం కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పోలీసులు స్పష్టం చేశారు. ఇదిలాఉంటే.. 2022 ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ముందు కూడా నేహా సింగ్ ఇలాగే ‘యూపీ మే కా బా’ అంటూ ఓ పాట పాడారు. తాజాగా దీని సెకండ్ వెర్షన్ను రిలీజ్ చేశారు. ఎలక్షన్ల సమయంలో ఆ పాట ఫుల్ వైరల్ అయింది. ఆ టైమ్లో అది పెను సంచలనంగా నిలిచింది.
ఇకపోతే, భోజ్పురి సినిమా సాంగ్స్ మంచి పాపులర్ అనే సంగతి తెలిసిందే. కానీ నేహా సింగ్ మాత్రం భోజ్పురి జానపద గీతాలను పాపులర్ చేయాలనుకున్నారు. ఈ క్రమంలో ప్రజా సమస్యలు, నిరుద్యోగం, అవినీతి, వరకట్నం, రాజకీయాలపై విమర్శలు సంధిస్తూ, చురకలు అంటిస్తూ, వ్యంగ్యంగా జానపద రీతిలో ఆమె పాటలను రాసుకుని ఆలపిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా రాష్ట్రంలోని అధికార బీజేపీ ప్రభుత్వంపై సెటైరికల్గా ఓ సాంగ్ను పాడి రిలీజ్ చేశారు. కాగా, నేహాకు యూట్యూబ్లో 8.67 లక్షల ఫాలోవర్లు ఉండటం గమనార్హం. ట్విట్టర్, ఇన్స్టా లాంటి మిగిలిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోనూ ఆమెకు గణనీయమైన స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
यू पी में का बा..!
Season 2#nehasinghrathore #kanpur #KANPUR_DEHAT #up #UPCM #Government #democracy #death pic.twitter.com/Onhv0Lhw12
— Neha Singh Rathore (@nehafolksinger) February 16, 2023