భారతదేశానికి జాతిపిత మహాత్మాగాంధీ. ఆయన మన దేశానికి స్వాతంత్ర్యం తెచ్చేందుకు తెల్లవారితో పోరాడారు. శాంతి, అహింస లనే ఆయుధంగా చేసుకుని ప్రాణాలకు తెగించి మరీ బ్రిటీష్ వారితో పారాడినారు. ఆయన పోరాట పటిమతో దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించింది. గాంధీ జీ త్యాగానికి గుర్తుగా ఆయనకు జాతిపిత అనే బిరుదు వచ్చింది. అయితే తాజాగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడణవీస్ భార్య అమృత ఫడణవీస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని ఆధునిక భారత జాతిపితగా అమృత అభివర్ణించారు. భారత దేశానికి ఇద్దరు జాతిపితలు ఉన్నారని, స్వాతంత్ర్య కాలంలో జాతిపిత మహాత్మాగాంధీ కాగా. మరొకరు ప్రధాని మోదీ అని ఆమె తెలిపారు. ఓ మాక్ కోర్ట్ ఇంటర్య్యూలో పాల్గొన్నా అమృత ఫడణవీస్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అమృత ఫడణవీస్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి,ప్రస్తుత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ గురించి ప్రత్యేకం చెప్పనక్కర్లేదు. తనదైన పాలనతో మహారాష్ట్ర ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఆయన భార్య అమృత ఫడణవీస్ కూడా అందరికి తెలుసు. ఆమె కు బ్యాంకర్ గా, గాయనిగా మంచి గుర్తింపు ఉంది. ఇటీవల కొంతకాలం నుంచి ఆమె తరచు వార్తలో నిలుస్తున్నారు. తాజాగా దేశానికి ఇద్దరు జాతిపితలు అంటూ చేసిన సంచలన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు. బుధవారం మాక్ కోర్టు ఇంటర్వ్యూలో పాల్గొన్న అమృత ఫడణవీస్.. దేశ పరిస్థితులపై అనేక విషయాలను వెల్లడించారు. అలానే దేశ నాయకుల గురించి కూడా పలు విషయాలు తెలిపారు.
ఇదే సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పితామహులు(జాతిపిత) అంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు. వెంటనే విలేకరి కలుగజేసుకుని.. మరి.. మహాత్మాగాంధీ ఏమవుతారంటూ ప్రశ్నించాడు. దీంతో ఆమె సమర్ధించుకుంటూ.. స్వాతంత్య్ర కాలంలో మహాత్మాగాంధీ జాతిపిత కాగా, నేటికాలానికి మోదీ జాతిపిత అంటూ కవర్ చేసుకున్నారు. అయితే అమృత ఫడణవీస్.. మోదీని పొగడటం ఇది తొలిసారిగా కాదు. 2019లో ప్రధాని మోదీకి పంపిన ట్విట్టర్ సందేశంలో కూడా మన దేశ జాతిపితామహుడు నరేంద్ర మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేసింది. ఆమె ఇలా తరచూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ వార్తలో నిలుస్తుంటారు. అయితే తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలను కొందరు సమర్ధించగా, మరికొందరు విమర్శించారు.
మహారాష్ట్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు యశోమతి ఠాకూర్.. అమృత వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఈ వ్యాఖ్యలపై మహాత్మాగాంధీ మనవడు తుషార్ గాంధీ కూడా స్పందించారు. “ఆరెస్సెస్ ఆదేశాలను పాటిస్తున్న ఆమె.. మోదీని నవభారత జాతిపితగా అభివర్ణించడాని స్వాగతిస్తున్నా. ఒకవేళ గాంధీ ఇప్పుడు బతికే ఉన్నా.. ప్రస్తుత భారతదేశాన్ని తిరస్కరించి ఉండేవారు” అని అన్నారు. ఇంకా పలువురు ప్రతిపక్ష పార్టీ నాయకులు అమృత వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరీ.. అమృత ఫడణవీస్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి