రామ భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిరం నిర్మాణం చక చకా పూర్తవుతోంది. త్వరలోనే భక్తులకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. 2024, జనవరి ఒకటో తేదీన అయోధ్య రామ మందిరాన్ని ఆవిష్కరించనున్నట్లు ప్రకటించారు. త్రిపురలో పర్యటిస్తున్న అమిత్ షా, ఓ సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీదును కూల్చివేసిన స్థలం వద్ద కొత్త ఆలయాన్ని నిర్మిస్తున్నారు.
70 ఎకరాల విస్తీర్ణంలో రామ మందిరం నిర్మాణం జరుగుతోంది. అద్భుతమైన వాస్తు, శిల్పకళా నైపుణ్యంతో నిర్మిస్తున్నారు. ప్రస్తుతానికి ఆలయానికి చెందిన నిర్మాణ పనులు 45 శాతం పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఆలయంతో పాటు మసీదు నిర్మాణ కూడా అదే గడువులోగా పూర్తవుతుందని ట్రస్ట్ తెలిపింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మసీదు నిర్మాణానికి కేటాయించిన స్థలంలో ఈ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. కాగా, 2019 నవంబర్ 9నాటి సుప్రీం కోర్టు తీర్పు అయోధ్య రామమందిరం నిర్మాణానికి మార్గం సుగమం చేసింది. నాటి తీర్పులో సుప్రీం కోర్టు.. బాబ్రీ మసీదును కూల్చివేసిన స్థలంలో రామ మందిరం నిర్మించవచ్చని, అయితే.. మసీదు నిర్మాణానికి గానూ ముస్లింలకు 5 ఎకరాల భూమిని ఇవ్వాలని ఆదేశించింది. అయోధ్యకు 26 కిలోమీటర్ల దూరంలోని ధన్నీపూర్ అనే గ్రామంలో మసీదు నిర్మాణం కోసం భూమిని కేటాయించారు.
#WATCH | Congress hindered the construction of Ram Temple in courts…After the SC verdict came, Modiji began the construction of the temple…Ram Temple will be ready on 1st January 2024: Union Home minister Amit Shah in Tripura pic.twitter.com/d7lZ8eegwS
— ANI (@ANI) January 5, 2023