ఆ రాష్ట్రంలో రైల్వే స్టేషన్లకు వెళ్లేందుకు ప్రయాణీకులు భయపడుతున్నారంటే.. అక్కడ టీవీల్లో ఎలాంటి దృశ్యాలు చూడాల్సి వస్తుందోనని వణుకుతున్నారు.
ఆ రాష్ట్రంలో రైల్వే స్టేషన్లకు వెళ్లాలంటే ప్రజలు భయపడుతున్నారు. అక్కడ పెద్ద పులో లేక దెయ్యమో సంచరించడం లేదు. పోనీ దొంగతనాలు జరుగుతున్నాయా అని భావిస్తున్నారెమో.. కానే కాదూ. రైళ్లు ఆలస్యం కారణంగా.. ఎక్కువగా గంటలు వేచి చూడలేక ప్రజలు ఇబ్బందులకు గురౌతున్నారా అంటే అదీ కాదూ. మరీ దేని కారణంగా రైల్వే స్టేషన్లకు వెళ్లేందుకు భయపడుతున్నారంటే.. అక్కడ టీవీల్లో ఎలాంటి దృశ్యాలు చూడాల్సి వస్తుందోనని వణుకుతున్నారు. భార్య, బిడ్దలతో కలిసి స్టేషన్లకు వెళుతున్న ప్రయాణీకులకు.. టీవీల్లో బూతు పురాణాలు ప్రసారం చేస్తూ భయకంపితులను చేస్తున్నాయి బీహార్ రైల్వే స్టేషన్లు. గతంలో ఓ స్టేషన్ టివీల్లో మూడు నిమిషాల పాటు ఫోర్న్ వీడియో ప్రసారమైన సంగతి విదితమే. ఇప్పుడు మరో సంఘటన వెలుగులోకి వచ్చింది.
బీహార్లోని పాట్నా రైల్వే స్టేషన్లో గతంలో టీవీ స్క్రీన్లపై బ్లూ ఫిల్మ్స్ ప్లే కాగా, దీనిపై అధికారులు చర్యలు తీసుకున్నారు కూడా. అయితే ఈ ఘటన మర్చిపోక ముందే మరో స్టేషన్లో ఇవే దృశ్యాలు కలకలం రేపాయి. ఈ సారి అసభ్య సందేశం ప్రత్యక్షమైంది. సోమవారం రాత్రి భాగల్పూర్ పట్టణ రైల్వే స్టేషన్ టీవీ తెరల మీద అసభ్య మేసేజ్లు దర్శనమిచ్చాయి. ఇది ఓ సంస్థకు చెందిన యాడ్ అని తెలుస్తుంది. వీటిని చూసి ప్రయాణికులు షాక్ అయ్యారు. ఐదు నుంచి పది నిమిషాల పాటు ప్రసారమయింది. దీన్ని కొంతమంది తమ సెల్ ఫోన్లలో బంధించారు. మరి కొందరు రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రయాణికుల ఫిర్యాదుతో మేల్కొన్న రైల్వే అధికారులు వెంటనే ఆ ప్రసారాలను నిలిపివేశారు. ఈ ఘటన మీద.. టీవీ ప్రసారాలు పై దర్యాప్తు చేస్తామని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.