గత పదిరోజుల నుంచి దేశవ్యాప్తంగా టమాటా ధరలపై చర్చలు నడుస్తున్నాయి. మొన్నటి వరకు ఇరవై రూపాల వరకు ఉన్న టమాటా ఇప్పడు ఏకంగా రూ.150 కి పైగా
గతకొంత కాలంగా దేశంలో నిత్యావసర సరుకుల ధరలు అడ్డూ, అదుపూ లేకుండా పెరుగుతున్నాయి. సామాన్య, మధ్య తరగతి కుటుంబాలపై పెరిగిపోతున్న ధరలు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. నిత్యం వినియోగించే పప్పు, బియ్యం, ఉల్లి, కూరగాయలు, నూనెల రేట్ల ధరలు రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. వీటికి తోడు ఈ మద్య టమాట, పచ్చి మిర్చి సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. గత నెల వరకు రూ.10 నుంచి రూ.20 వరకు పలికిన టమాటా ఇప్పుడు రూ.150కి చేరింది.. కొన్ని రాష్ట్రాల్లో ఏకంగా రూ.250 వరకు పలుకుతుంది. ఇలాంటి సమయంలో ఓ ప్రాంతంలో కిలో టమాటా కేవలం ఒక్కరూపాయికే విక్రయించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ప్రస్తుతం మార్కెట్ లో టమాటా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.. కిలో ఏకంగా రూ.150కి పైగా అమ్ముతున్నారు. ఉత్తరాదిన టమాటా మరింత ప్రియంగా మారింది. ఉత్తరాఖండ్ లో కిలో టమాటా రూ.250 కి చేరింది. అకస్మాత్తుగా ధరలు పెరిగిపోవడంతో సామాన్యులు టమాటా కొనాలంటేనే భయపడే పరిస్తితి నెలకొంది. వంటకాల్లో టమాటా ఖచ్చితంగా వాడుతుంటారు.. దీంతో ఎంత ఖరీదైనా తప్పనిసరి కొనాల్సి వస్తుంది. వర్షాకాల ప్రభావం టమాటా పంటలపై తీవ్రంగా చూపిస్తుందని అంటున్నారు. ఇటీవల డిమాండ్కి తగ్గట్టుగా టమాటా దిగుబడి లేకపోవడం, సప్లయ్లో కూడా తేడా రావడంతో ధరలకు రెక్కలొచ్చాయని వ్యాపారులు అంటున్నారు.
ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రజల ఇక్కట్లు అర్ధం చేసుకొని తమిళనాడులో ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకే కార్యదర్శి ఆర్ఎస్ రాజేష్ పార్టీ తరుపున ఒక టన్ను టమాటా దిగుమతి చేసుకొని.. పేద ప్రజలకు కేవలం రూ.1 కే కిలో చొప్పున విక్రయించాడు. ఆర్ కే నియోజకవర్గంలో తండయార్ పేటలో టమాటాలను దాదాపు వెయ్యి మంది వరకు కొనుగోలు చేయడం విశేషం. ఈ సందర్బంగా టమాటా కొనుగోలు చేసిన వారందరూ అన్నాడీఎంకే కి కృతజ్ఞతలు తెలియచేశారు. కాగా, పళణిస్వామి సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అన్నాడీఎంకే కార్యదర్శి రాజేష్ తెలిపారు.