ఫిల్మ్ డెస్క్- సినిమా టిక్కెట్ ధరల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, సినిమా ఇండస్ట్రీలోని పలువురు పెద్దలకు మధ్య వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల ధరలను పూర్తిగా తగ్గించడంతో టాలీవుడ్ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఐతే తెలుగు సినీ పరిశ్రమ మనుగడ సాధించినట్టేనని వాపోతున్నారు.
పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు సినీ హీరోలు, నిర్మాతలు భహిరంగంగానే ఏపీలోో వైసీపీ ప్రభుత్వం సినిమా టిక్కెట్ల విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. ఈమేరకు సీఎం జగన్ నిర్ణయంపై విమర్శళు గుప్పిస్తున్నారు. ఈ వ్యవహారం చివరికి హైకోర్టుకు చేరింది. మరి కోర్టు తీర్పు ఎలా ఉండబోతోందని సర్వత్రా ఆసక్తినెలకొంది.
ఇదిగో ఇటువంటి సమయంలో డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఏపీలో సినిమా టిక్కెట్ల వ్యవహారంపై స్పందించారు. సినిమా టికెట్ ధరలో అంశంపై ఆయన సుధీర్ఘ లేఖను రాశారు. ఇంత వరకు ఏపీ ప్రభుత్వంతో కొందరు సినీ పెద్దలు జరిపిన చర్చలు, జరిగిన భేటీలపై మోహవ్ బాబు కౌంటర్ వేశారు.
మోహన్ బాబు లేఖలో ఏమాన్నారంటే.. మనకెందుకు, మనకెందుకు అని మౌనంగా ఉండాలా.. నా మౌనం చేతకానితనం కాదు.. చేవలేనితనం కాదు.. కొంత మంది శ్రేయోభిలాషులు వద్దని వారించారు.. నీ మాటలు నిక్కచ్చిగా ఉంటాయ్.. కఠినంగా ఉంటాయ్..కానీ నిజాలే ఉంటాయ్.. ఇతరుల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఇది నీకు అవసరమా అన్నారు. అంటే వాళ్లు చెప్పినట్టు బతకాలా.. నాకు నచ్చినట్టు బతకాలా.. అనే ప్రశ్న ఎదురైంది.. దానికి సమాధానమే ఇది.. అని మోహన్ బాబు లేఖను ప్రారంభించారు.
సినిమా ఇండస్ట్రీ అంటే నలుగురు హీరోలు, నలుగురు ప్రొడ్యూసర్స్, నలుగురు డిస్ట్రిబ్యూటర్స్ కాదు.. కొన్ని వేల మంది ఆశలు, కొన్ని వేల కుటుంబాలు, కొన్ని వేల జీవితాలు. 47 సంవత్సరాల అనుభవంతో చెప్తున్న మాట.. అందరి జీవితాలతో ముడిపడిన ఈ సినిమా ఇండస్ట్రీ గురించి మనకు ఉన్న సమస్యల గురించి ముఖ్యమంత్రులకు వివరించాలనుకుంటే అందరూ కలిసి ఒక చోట సమావేశమై సమస్యలు ఏంటి? పరిష్కరాలు ఏంటి?.. ఏది చేస్తే సినీ పరిశ్రమకి మనుగడ ఉంటుంది అని చర్చించుకోవాలి.. అని మోహన్ బాబు అభిప్రాయపడ్డారు.
ఆ తర్వాత మాత్రమే సినిమాటోగ్రఫీ మంత్రుల్ని, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కలిసికట్టుగా కలవాలి. అలా కాకుండా నలుగుర్నే రమ్మన్నారు.. ప్రొడ్యూసర్స్ నుంచి నలుగురు, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ముగ్గురు, హీరోల నుంచి ఇద్దరు, ఏంటిది.. మళ్లీ మళ్లీ చెప్తున్నా సినిమా పరిశ్రమలో ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు.. అందరూ సమానం.. ఏ ఒక్కరి గుత్తాధిపత్యం కాదు.. చిన్న నిర్మాతల్ని కూడా కలుపుకుని ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్లి సమస్యల్ని వివరిస్తే మనకీ రోజు ఇన్ని కష్టాలు వచ్చి ఉండేవి కావు.. అని చెప్పుకొచ్చారు మోహన్ బాబు.
ఇక.. సినీ పరిశ్రమలో ఒక పార్టీ వాళ్లు ఉండొచ్చు.. లేదా వేరు వేరే పార్టీల వాళ్లు ఉండొచ్చు.. అది వాళ్లిష్టం.. కాదనను.. కానీ ప్రజలు గెలిపించిన ముఖ్యమంత్రుల్ని ముందుగా మనం కలవాలి.. వాళ్లని మనం గౌరవించుకోవాలి.. మన కష్టసుఖాలు చెప్పుకోవాలి.. అలా జరిగిందా? జరగలేదు.. అని మోహన్ బాబు ఆవేధన వ్యక్తం చేశారు.
50 రూపాయలు, 300 రూపాయల టికెట్ల రేట్లతో చిన్న సినిమాలు నిలబడటం కష్టం.. 50 రూపాయలు, 30 రూపాయల టికెట్ల రేట్లతో పెద్ద సినిమాలు నిలబడటం కష్టం.. చిన్న సినిమాలు ఆడాలి.. పెద్ద సినిమాలు ఆడాలి.. దానికి సరైన ధరలుండాలి.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కలిసి, అయ్యా.. మా సినీ రంగం పరిస్థితి ఇది.. చిన్న సినిమాల్ని పెద్ద సినిమాల్ని దృష్టిలో పెట్టుకుని మనకి న్యాయం చేయమని అడుగుదాం.. అని మోహన్ బాబు సలహా ఇచ్చారు.
కలిసి సినిమాని బతికిద్దాం pic.twitter.com/i6Z421REqA
— Mohan Babu M (@themohanbabu) January 2, 2022