కూనవరంలో పర్యటించిన సీఎం జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అందరికి సహాయం అందేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.
కొన్ని రోజులు ఈ కుర్రాడి స్టైల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మేన మామ పోలికలు వచ్చి చేరాయని ఫ్యూచర్ స్టార్ అని కితాబులందుకున్నాడు. సరిగ్గా ఇలాంటి పోలిక ఒకటి వై.యస్.ఆర్ కుటుంబంలో జరిగింది. వారిద్దరూ ఎవరో కాదు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు, అతని మేనల్లుడు రాజారెడ్డి.
ఇల్లు లేని పేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణాలను చేపట్టింది. ఇప్పటికే దాదాపు 18 లక్షలకు పైగా ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. నిర్మాణ పనుల్లో కదలిక తెచ్చేందుకు లబ్థిదారులకు అడ్వాన్స్ గా రూ. 20 వేలు ప్రభుత్వం అందించనుంది.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు తీపి కబురును అందించింది. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఇటీవల ఏపీలో సినిమా టికెట్ ధరలు తగ్గించిన సమయంలో వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. మొత్తానికి టికెట్ ధరల తగ్గింపు ప్రభావం ఈ రెండు సినిమాల పై బాగానే పడింది.
టీమిండియా క్రికెటర్ అంబటి రాయుడు అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. రిటైర్మెంట్ తర్వాత తన పొలిటికల్ కెరీర్ నిర్మాణంపై ఫోకస్ పెంచుతున్నాడీ తెలుగు క్రికెటర్. ఈ క్రమంలో వైసీపీ పార్టీతో అతడు టచ్లోకి వెళ్లడం, సీఎం జగన్ను పలుమార్లు కలవడం తెలిసిందే. అయితే రాయుడు వైసీపీలో చేరడానికి చంద్రబాబు మీద ఉన్న కోపమే కారణమనే వాదన వినిపిస్తోంది.
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. సీఎం జగన్ వాటిని అట్టడుగు వర్గం వారికి ఆర్థిక సాయంగా అందిస్తున్నారు. వాటిలో భాగంగా బడికి వెళ్లే విద్యార్థులకు జగనన్న అమ్మఒడి పథకాన్ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రవేశపెట్టారు. తెల్ల రేషన్ కార్డు ఉండి, ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలలో చదివించే పిల్లలకు ఈ పథకం వర్తిస్తుంది.
ఏపీలో రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి నుంచి అధికార, ప్రతిపక్ష నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. ఇటీవల సీఎం జగన్ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా గుడ్ న్యూస్ లు వినిపిస్తున్నారు.