ఎప్పుడు ఎన్నికలు జరిగినా భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి కీలక వాగ్ధానాలు రాజకీయ నాయకులకు పరిపాటి. వీరిలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఒక్కరు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా.. కరెక్టుగా నాలుగు రోజుల ముందు మోదీ సభ జరుగుతుంది. ఈసారి అలానే నిర్వహిద్దాముకున్నారు. కానీ, అందుకు అనుమతి రాలేదు.
దేశ ప్రధాని నరేంద్ర మోదీకి చేదు అనుభవం ఎదురైంది. మేఘాలయలోని స్టేడియంలో ప్రధాని మోమోదీ ర్యాలీకి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కాన్రాడ్ కె సంగ్మా అనుమతి నిరాకరించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సంచలనంగా మారింది. ఫిబ్రవరి 24న షిల్లాంగ్, తురాలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించాల్సి ఉంది. అయితే, స్టేడియం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడం, సైట్లో ఉంచిన మెటీరియల్ భద్రత దృష్ట్యా సభకు అనుమతి నిరాకరించినట్లుగా మేఘాలయ క్రీడా విభాగం పేర్కొంది.
ఫిబ్రవరి 27న మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, మార్చి 2న ఫలితాలు వెలువడనున్నాయి. మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అందులో భాగంగానే నరేంద్ర మోదీ అక్కడ పర్యటించి ఎన్నికలు వాగ్ధానాలు ప్రకటించాల్సి ఉంది. ఈ మేరకు పీఏ సంగ్మా స్టేడియంలో మోదీ ఎన్నికల ర్యాలీ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా అక్కడి బీజేపీ నాయకులు స్థానిక ప్రభుత్వ అధికారుల అనుమతి కోరారు. అయితే, అక్కడి అధికారులు అందుకు అనుమతి నిరాకరించారు.
“ప్రధాని సభ అంటే జనం భారీగా తరలివస్తారు. పీఏ సంగ్మా స్టేడియానికి అంత సామర్థ్యం లేదు. పైగా స్టేడియం నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతున్నందున సైట్లో ఉంచిన మెటీరియల్ భద్రత కోసం సభకు అనుమతించడం లేదని మేఘాలయ క్రీడా విభాగం పేర్కొంది”. అయితే, వేదికను మార్చుకుంటే సభకు అనుమతి ఇస్తామని మేఘాలయ క్రీడా విభాగం పేర్కొంది. అలోత్గ్రే క్రికెట్ స్టేడియంలో ర్యాలీ నిర్వహించుకోవచ్చని తెలిపింది. 127 కోట్లతో నిర్మించిన ఈ స్టేడియాన్ని ముఖ్యమంత్రి కాన్రాడ్ కె సంగ్మా గతేడాది డిసెంబర్ 16న ప్రారంభించారు.
BJP national secretary Rituraj Sinha questioned the National People’s Party government in poll-bound Meghalaya for denying permission for holding a rally of Prime Minister in Tura.#Election2023 #Meghalaya #NarendraModi pic.twitter.com/CCiXLW5PuS
— The Statesman (@TheStatesmanLtd) February 20, 2023