దేశంలో ఎప్పుడు, ఎక్కడ ఎన్నికలు జరిగినా ముందుగా ప్రజల నాడిని తెలిపేవే.. ఎగ్జిట్ పోల్స్. ఇవి వాస్తవ ఫలితాలు కానప్పటికీ.. ప్రజల అభిప్రాయాలను సేకరించి వీటిని ప్రటకటిస్తారు కనుక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై అందరికీ ఆసక్తి ఎక్కువ. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో వివిధ మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించాయి. ఆ వివరాలు..
ఎప్పుడు ఎన్నికలు జరిగినా భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి కీలక వాగ్ధానాలు రాజకీయ నాయకులకు పరిపాటి. వీరిలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఒక్కరు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా.. కరెక్టుగా నాలుగు రోజుల ముందు మోదీ సభ జరుగుతుంది. ఈసారి అలానే నిర్వహిద్దాముకున్నారు. కానీ, అందుకు అనుమతి రాలేదు.
ఈ మద్య విమాన, హెలికాప్టర్ ప్రమాదాల సంఖ్య పెరిగితున్నాయి. టేకాఫ్ అయిన కొద్ది సమయానికే ప్రతికూల వాతావరణం వల్లనో.. టెక్నికల్ ఇబ్బందుల వల్లనో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. టేకాఫ్ అయినా.. వాతావరణ పరిస్థితులను అంచనావేసి వెంటనే అప్రమత్తమై పైలెట్లు అత్యవసర ల్యాండింగ్ చేయడం వల్ల ప్రాణాలతో సురక్షితంగా బయట పడుతున్నారు. గతంలో పలువురు రాజకీయ నేతలు ప్రయాణిస్తున్న హెలికాప్టర్లు ప్రమాదాలకు గురైన విషయం తెలిసిందే. ఆ మద్య ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి హెలికాప్టర్ […]
మేఘాలయ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు బెర్నార్డ్ మరక్ ఆధ్వర్యంలో నడుస్తున్న వ్యభిచార గృహం గుట్టు రట్టు అయిన సంగతి తెలిసిందే. ఆ కేసుతో సంబంధం ఉన్న బెర్నార్డ్ ను తాజాగా ఉత్తరప్రదేశ్ లో అరెస్టు చేశారు. ఆయన ఫార్మ్హౌజ్లో వ్యభిచార గృహాన్ని నడుపుతున్నట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. యూపీలో అరెస్టు అయిన బెర్నార్డ్ను తీసుకువచ్చేందుకు తమ బృందం వెళ్తున్నట్లు వెస్ట్ గారో హిల్స్ ఎస్పీ వివేకానంద సింగ్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేఘాలయ రాష్ట్రంలోని పశ్చిమ […]
28 మంది మహిళలు., నలుగురు బాలురు, 500కు పైగా కండోమ్లు. ఇలా చీకటిగా సాగిస్తున్న వ్యభిచారం దందా గట్టు రట్టైన ఈ ఘటన అందరికి దడపుట్టించేలా చేస్తుంది. తాజాగా మేఘాలయలో వెలుగు చూసిన ఈ ఉదాంతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారింది. దీనిపై పక్కా స్కెచ్ తో వెళ్లిన పోలీసులకు ఈ చీకటి వ్యభిచారం దందా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది మేఘాలయలోని వెస్ట్ గారోహిల్స్ జిల్లాలోని తురా పట్టణం. స్థానిక రాజకీయ […]
రానున్నది అసలే పండుగలు, వేడుకల సీజన్. క్రిస్మస్, ఆ వెంటనే న్యూ ఇయర్ వేడుకలు. ఇక మందుబాబుల వారం రోజుల పాటు పండగ చేసుకుంటారు. మద్యం దుకాణాలకు ఫుల్లు గిరాకీ. ఈ వారం రోజులను తెగ క్యాష్ చేసుకుంటాయి మద్యం దుకాణాలు. అయితే ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో.. వేడుకలు, పండుగలపై ఆంక్షలు విధించాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలకు సూచించింది. చాలా రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో మేఘాలయ ప్రభుత్వం మందు బాబులకు […]
మేఘాలయలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న బస్సు నదిలోకి దూసుకెళ్లింది. మేఘాలయలోని తురా నుంచి షిల్లాంగ్ నగరానికి వెళుతున్న బస్సు అర్దరాత్రి 12 గంటలకు ప్రమాదవశాత్తు నోంగ్చ్రామ్లోని రింగ్ది నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు ఘటనాస్థలిలోనే చనిపోయారు. మరో 16 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ఈ బస్సులో 21 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. అర్ధరాత్రి 12 గంటల సంమయంలో నాంగ్చ్రామ్ వద్ద […]
మేఘాలయలో ఉద్రిక్తత కొనసాగుతోంది. నేషనల్ లిబరేషన్ కౌన్సిల్ మాజీ నేత చెరిష్స్టార్ఫీల్డ్ థాంగ్కీ మరణంతో.. హింసాత్మక ఘటనలు తలెత్తాయి. థాంగ్కీ మద్దతుదారులు ఆందోళనలకు దిగారు. పలుచోట్ల ప్రభుత్వ వాహనాలపై దాడులు చేశారు. ఏకంగా ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా వ్యక్తిగత నివాసంపై ఆదివారం అర్ధరాత్రి పెట్రోల్ బాంబులు విసిరారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఆందోళనకారలు 3 వ మైలు ఎగువ షిల్లాంగ్లోని లైమర్లోని ముఖ్యమంత్రి వ్యక్తిగత నివాసం వద్ద ఈ దాడికి పాల్పడ్డారు. రెండు మోలోటోవ్ […]